Prabhas: మొన్నటి వరకు టాలీవుడ్కి పరిమితమైన స్టార్ హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్గా మారిన విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ అనే సినిమాతో ఎన్టీఆర్ నేషనల్ స్టార్డమ్ అందిపుచ్చుకోగా, ఇప్పుడు తన తర్వాతి చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్లో విడుదల చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ భారీ చిత్రం తర్వాత డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంతో నటిస్తున్నారు. ఇది ఎన్టీఆర్ 30వ సినిమాగా రూపొందనుంది. కొద్ది రోజులుగా ఈ సినిమాకి సంబంధించి అనేక ప్రచారాలు నడుస్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియడం లేదు.
![Prabhas : ప్రభాస్ తో రొమాన్స్ చేసిన ఆ హీరోయినే కావాలి " అని పట్టుబడుతోన్న తెలుగు టాప్ హీరో ? tollywood-heros-wants-that-heroine](https://dailytelugunews.com/wp-content/uploads/2022/11/9.jpg)
Prabhas : గుడ్ న్యూస్..
కొరటాల శివ – ఎన్టీఆర్ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయని మేకర్స్ తెలిపారు. డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ గా సాబు సిరిల్ తమపని మొదలెట్టారట. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్.. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శత్వంలో మూవీ చేయనున్నాడు. ఇందులో తారక్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ ఎవరనేది సస్పెన్స్గా మారింది. కొన్నాళ్ల నుంచి హీరోయిన్ ను ఫైనల్ చేయడంలో సతమతం అవుతున్న చిత్ర యూనిట్ ఓ బాలీవుడ్ యంగ్ భామకి అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఆ బ్యూటీ మరెవరో కాదు శ్రద్ధా కపూర్. నటుడు శక్తి కపూర్ నట వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు తనదైన నటనతో దూసుకుపోతుంది. తెలుగు ప్రేక్షకులను ప్రభాస్ హీరోగా నటించిన ‘సాహో’తో పలకరించగా, ఈ చిత్రం శ్రద్ధాకి నిరాశ మిగిల్చింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ సినిమాతో అలరించాలని అనుకుంటుందట. ఇప్పటికే శ్రద్దాతో సంప్రదింపులు అయిపోయాయని త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, 2010లో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన ‘తీన్పత్తి’ సినిమాతో వెండి తెర ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తొలి సినిమాతోనే నటిగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.