Samantha : సమంత అనార్యోగ పరిస్థితిపై స్పందించిన టీమ్..! ఆ వార్తలన్నీ నిజమేనా.!?

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటీస్ అనే అరుదైన వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. సమంత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్టు ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆమె పరిస్థితి విషమంగా ఉంది అంటూ పుకార్లు గుప్పుమన్నాయి. ఈ విషయం తెలుసుకున్న సమంతా అభిమానులు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందోనని ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే సమంత ట్రీట్మెంట్ కోసం దక్షిణ కొరియా వెళ్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.. వీటిపై సమంతా టీం స్పందించినట్లు తెలుస్తోంది..

Samantha treatment going to foreign and helath condition news was fake
Samantha treatment going to foreign and helath condition news was fake

ప్రముఖ మీడియా ఛానల్ ప్రతినిధి సమంతా ఆరోగ్యం గురించి ఆమె టీమ్ ను సంప్రదించగా.. సమంత దక్షిణాఫ్రికా వెళ్లడం ఏంటని ఆమె వ్యక్తిగత టీమ్ విస్మయం వ్యక్తం చేసింది. అసలు ఇలాంటి పుకార్లు ఏ సమాచారం లేకుండా ఎలా పుట్టిస్తారు అని రూమర్లపై ఆమె టీం మండిపడింది. సమంత ప్రస్తుతం హైదరాబాదులోని తన ఇంట్లోనే ఉంటుందని.. ఆమె అనారోగ్యం నుంచి కోలుకొని విశ్రాంతి తీసుకుంటూ సంతోషంగా ఉందని వారు సమంత ఆరోగ్యం పై క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పారు.

సమంతా విజయ్ దేవరకొండ జంటగా మజిలీ చిత్ర దర్శకుడు శివ నిర్మాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లోనే సమంత పాల్గొనాల్సి ఉంది. వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటున్న సమంత త్వరలోనే ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నారని తెలియజేశారు. ఇక ఇదే విషయాన్ని ఖుషి సినిమా దర్శకుడు శివ నిర్మాణాను అడగగా.. సమంత ఆరోగ్యం పై వస్తున్నా వార్తలు అన్ని గాసిప్స్ ఏనని.. ప్రస్తుతం ఆమె కండిషన్ బాగుందని షూటింగ్ కూడా వస్తానని మాతో చెప్పిందని ఉన్న విషయాన్ని కొండ బద్దలు కొట్టాడు డైరెక్టర్. సమంత తనతో టచ్ లోనే ఉంటున్నారని.. ఆమె సంతోషంగా, ఆరోగ్యంగా ఉందని చెప్పుకొచ్చారు. వీటన్నింటినీ బట్టి చూస్తే సమంతా పరిస్థితి విషమంగా ఉందని వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని తేలిపోయింది.