Mahesh Babu : సూపర్ స్టార్ కృష్ణ భార్య, మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే.. ఆమె మరణ వార్త విని ఘట్టమనేని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.. మహేష్ బాబు పిల్లలు కూడా నానమ్మ మీద ఉన్న ప్రేమను వారికి కన్నీళ్ళ రూపంలో తెలియజేశారు. సితార మహేష్ ఒడిలో కూర్చొని వెక్కి వెక్కి ఏడ్చింది.. తనను ఓదార్చే ప్రయత్నం చేసిన మహేష్ ని చూస్తూ.. ఆ పక్కనే ఉన్న సూపర్ స్టార్ కృష్ణ కూడా కన్నీళ్లను ఆపుకోలేక ఏడ్చేసాడు..!! మహేష్ కి తన తల్లి అంటే ఎంతో ప్రేమ..! అసలు ఇందిరా దేవి చనిపోయే ముందు ఏమిందంటే.!?
Mahesh Babu : మహేష్ ఆ మూడు రోజులు.!?
మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంది.. దాంతో ఆమెను హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ లో ఉంచి ట్రీట్మెంట్ ఇప్పించారు.. సుమారు నెల రోజుల పాటు ఆమె హాస్పిటల్ లో చికిత్స తీసుకున్నారు.. ఆ ట్రీట్మెంట్ కు ఆమె ఆరోగ్యం కాస్త కుదుటపడింది.. దాంతో వైద్యులు కూడా ఆమెను ఇంటికి తీసుకోవాలని సూచించారు కానీ ఇంటికి తీసుకు వచ్చిన తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితి మళ్లీ విషమించింది వైద్యులు మేము ఏమి చేయలేం అంటూ చేతులు ఎత్తేశారు.. ఆమెను దగ్గరగా అబ్జర్వ్ చేసిన వైద్యులు మూడు నుంచి నాలుగు రోజులు తప్ప ఎక్కువ రోజులు బ్రతకలేరు అని కూడా ఇన్ డైరెక్ట్ గా చెప్పేసారట.. ఆ విషయం తెలిసి మహేష్ బాబు కుటుంబ సభ్యులు మొత్తం చివరి రోజుల్లో తన పక్కనే ఉండి అందరూ ధైర్యం చెప్పాలని డిసైడ్ అయ్యారట..
ఇక మహేష్ బాబు అయితే తన షూటింగ్ షెడ్యూల్ కూడా క్యాన్సిల్ చేసుకుని.. ఆ చివరి మూడు రోజులు తన అమ్మ దగ్గరే ఉన్నాడట.. మహేష్ చివరికి రాత్రులు కూడా అమ్మ మంచం దగ్గరే కూర్చుని.. ఇందిరాదేవి పాదాలకు సేవ చేస్తు ఉందిపోయాడట మహేష్.. ఇప్పుడు రెప్ప వేసినా కూడా తను అమ్మతో ఆ క్షణాలు మళ్ళీ అమ్మతో గడిపే సమయం ఉందని మహేష్ అక్కడే ఉన్నారట.. ఆ బెడ్ కి ఒక వైపు మహేష్ మరో వైపు కృష్ణ ఉన్నారట.. సెప్టెంబర్ 28న ఇందిరా దేవి శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.. మహేష్ నీ తీరని బాధ మిగిల్చారు.. మహేష్ కి అమ్మ అంటే ఎంత ఇష్టమో.. తన చేతి కాఫీ తాగకుండా ఏ సినిమా కూడా వెళ్లనని స్వయంగా మహర్షి సినిమా సక్సెస్ మీట్ లో మహేష్ చెప్పారు..