Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో #SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.. మహేష్ తన తల్లి, తండ్రిని కోల్పోయిన తరువాత మళ్ళీ ఈ సినిమా షూటింగ్ లో నిన్న పాల్గొన్నారు.. మహేష్ ఈ సినిమా షూటింగ్ సెట్స్ లోకి రాగానే ఓ పని చేశారని.. అది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిందని ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.!
మహేష్ తన తల్లి ఇందిరా దేవి మరణం నుంచి కోలుకోక ముందే సూపర్ స్టార్ కృష్ణ ఈ లోకాలను విడిచిపెట్టి వెళ్లిపోయారు. మహేష్ బాధను చూస్తుంటే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. మహేష్ ఇంత బాధలో ఉన్నా కూడా బ్యాక్ టు వర్క్ వచ్చేసాడు. మహేష్ ను చూడగానే సెట్స్ లో అంతా సైలెంట్ అయిపోయారట. మహేష్ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి కూడా కొంతమంది చూడలేకపోయారట. ఆ విషయాన్ని గమనించిన మహేష్ తన గుండెను నిబ్బరం చేసుకుని.. అందరిని నవ్వించడానికి ఓ జోక్ వేశారట. ఇక నవ్వుతూ మొదటి రోజు షూటింగ్ స్టార్ట్ చేశారని ఆ సినిమా షూటింగ్ లో పాల్గొన్న వారి నుంచి అందుతున్న సమాచారం.
తన వల్ల ఎవరూ బాధపడకూడదు అని ముఖ్యంగా సినిమా షూటింగ్ లో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండాలని మహేష్ ఇలా చేశారట. మహేష్ కి సినిమా ఓ కన్ను అయితే కుటుంబం మరొక కన్ను. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న సినిమా లో స్పెషల్ సాంగులో రష్మిక మందన కనిపించబోతుందని నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. తాజాగా ఈ ఐటమ్ సాంగ్ లో మహేష్ సరసన మిల్క్ బ్యూటీ తమన్నా నటించనుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న సెకండ్ షెడ్యూల్లో మహేష్ పూజా హెగ్డే కి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని తెలుస్తోంది.