Anchor Anasuya : సుప్రీం కోర్టు లో కేసు వేసిన యాంకర్ అనసూయ .. అతిపెద్ద కంపెనీకి ఎదురు వెళ్ళి యుద్ధం !

Anchor Anasuya : తాజాగా యాంకర్ అనసూయకు ఎయిర్ పోర్టులో అవమానం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఒక ఎయిర్ లైన్స్ సంస్థ ఆమెను అవమానించినట్టు.. ఇబ్బందులకు గురిచేసినట్లు అనసూయ సోషల్ మీడియా వేదికగా తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి వెల్లడించింది. ఇక చివరకు తన షర్టు కూడా చిరిగిపోయిందంటూ సుదీర్ఘ సందేశం విడుదల చేసింది ఈ ముద్దుగుమ్మ.. యాంకర్ అనసూయ ప్రస్తుతం ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఏ విషయమైనా సరే కుండబద్దలు కొట్టడం ఆమె నైజం.. ఇక తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఎవరు చేసినా సరే వారికి తప్పక దండన విధిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఎయిర్ పోర్ట్ వేదికగా జరిగిన ఒక ఇబ్బందికర సంఘటనపై తనదైన శైలిలో స్పందించారు అనసూయ.

బెంగళూరు నుంచి హైదరాబాదుకి అనసూయ కుటుంబ సభ్యులతోపాటు ప్రయాణం అయింది. దీనికోసం ఆమె ఒక ఎయిర్ లైన్స్ సంస్థ లో ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఫ్లైట్ బయలుదేరే సమయాని కంటే ముందే ఎయిర్ పోర్ట్ కు రావాలి అని సంస్థ వారు సందేశం పంపడంతో ఎయిర్ పోర్ట్ కి వెళ్ళాక మాస్క్ లు లేవని లోపలికి పంపలేదట. ఇక మాస్కులు ధరించి ఫ్లైట్లో లోపలికి వెళ్లిన తర్వాత సీట్లన్నీ ఒకచోట కాకుండా అక్కడక్కడ కేటాయించారట. అయితే వీరు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లడం వల్ల ఒకే చోట బుక్ చేసుకున్నారట . కానీ వేరువేరుగా కూర్చోబెట్టడంతో ఒకే చోట సీట్ బుక్ చేసినప్పుడు వేరువేరుగా ఎలా కూర్చోబెడతారు అని అనసూయ అడిగినా కూడా సమాధానం ఇవ్వలేదట.

Anchor Anasuya filed a case in the Supreme Court
Anchor Anasuya filed a case in the Supreme Court

పైగా అనసూయ కూర్చున్న సీటు కూడా సరిగా లేదట. ఇక సీటు చిరిగిపోయి ఉండడం వల్ల పదునైన వస్తువును తాకి ఆమె చొక్కా కూడా చిరిగిపోయిందట. ఎయిర్ పోర్ట్ తోపాటు ఫ్లైట్లో ఎదురైనా ఇబ్బందికర పరిస్థితులను వివరిస్తూ అనసూయ సోషల్ మీడియాలో సందేశం పోస్ట్ చేశారు. ఇక ఆమె ప్రయాణం చేసిన ఎయిర్ లైన్స్ సంస్థను చెత్త సంస్థగా అభివర్ణించడమే కాకుండా సుప్రీంకోర్టులో కేసు వేసినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అతిపెద్ద ఎయిర్ లైన్స్ తో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంది అనసూయ అన్నట్లు కూడా వార్తలు బాగా వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ ఎలా వివరణ ఇస్తుందో తెలియాల్సి ఉంది.