Allu Arjun : పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ స్టేటస్ ని అందుకున్నారు.. ప్రపంచవ్యాప్తంగా పుష్ప మ్యానియా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.. ఇక పుష్ప 2 సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూసేలా చేశారు. హైదరాబాద్ అమీర్ లోని సత్యం థియేటర్ ని కూల్చివేసి చాలా కాలం అయిన సంగతి తెలిసిందే. ఎంతో మంచి పేరున్న ఈ థియేటర్ స్థానంలో ఇప్పుడు అల్లు అర్జున్ సరికొత్త హంగులతో ఒక ఏషియన్ సినిమాస్ తో భారీ మల్టీప్లెక్స్ ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల్లోనే ఈ మల్టీప్లెక్స్ ఘనంగా ప్రారంభం కానుంది. ముఖ్యఅతిథులు కూడా హాజరు కానున్నారని తెలుస్తోంది..
![Allu Arjun : అల్లు అర్జున్ వినూత్న ప్లాన్.. అంతా అందుకోసమేనా.? Allu Arjun AAA multiplex special effects](https://dailytelugunews.com/wp-content/uploads/2022/11/4-2.jpg)
అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ లో తనకి సంబంధించిన ఒక విగ్రహం ని ఏర్పాటు చేస్తున్నాడట. తన విగ్రహాన్ని తానే తయారు చేయడం తో పాటు అందుకు సంబంధించిన ఏర్పాట్లు మొత్తం తనే దగ్గరుండి చూసుకుంటున్నాడట. ఇది వర్చువల్ విగ్రహం అని తెలుస్తోంది. భారీ ఖర్చుతో అల్లు అర్జున్ వర్చ్యువల్ ఇమేజ్ ను ఏర్పాటు చేస్తున్నారట. దీని ముందు నిల్చుని ఎవరు ఎలా చేస్తే ఆ ఇమేజ్ అలా రియాక్ట్ అవుతుందట.
![Allu Arjun : అల్లు అర్జున్ వినూత్న ప్లాన్.. అంతా అందుకోసమేనా.? Allu Arjun AAA multiplex special effects](https://dailytelugunews.com/wp-content/uploads/2022/12/dd.jpg)
రెగ్యులర్ స్క్రీన్ లతో పాటు శ్యామ్ సంగ్ నుంచి ఓ భారీ టీవీ స్క్రీన్ ను కూడా తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. దాని వల్ల ప్రొజెక్టర్ అవసరం లేకుండా సినిమా వేసుకోవచ్చు. క్లారిటీ కూడా బాగుంటుందట.