Allu Aravind : ఇటీవల టాలీవుడ్లో మల్టీ స్టారర్స్ హంగామా ఎక్కువగా నడుస్తున్న విషయం తెలిసిందే. చిన్న హీరోలతో పాటు పెద్ద హీరోలు సైతం మల్టీ స్టారర్స్పై ఆసక్తి చూపుతున్నారు. ఇక త్వరలో చిరంజీవి, బాలకృష్ణ కాంబినేషన్లో ఓ మల్టీ స్టారర్ రాబోయే అవకాశం ఉంది. అల్లు అరవింద్ రీసెంట్గా దీని గురించి హింట్ ఇచ్చారు. నటసింహా నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా దూసుకుపోతున్న ‘అన్స్టాపబుల్ 2’ టాక్ షో నుంచి ఐదో ఎపిసోడ్ ఈ రోజు రాత్రి నుండి స్ట్రీమింగ్ కానుండగా, దీనికి సంబంధించి రీసెంట్గా ప్రోమో విడుదల చేశారు. ఈ ఎపిసోడ్లో నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబుతో పాటు సీనియర్ దర్శకులు కె.రాఘవేంద్రరావు, ఎ.కోదండరామిరెడ్డి అతిథులుగా హాజరయినట్టు కనిపించింది.
క్రేజీ న్యూస్..
అల్లు అరవింద్, సురేష్ బాబు, కె.రాఘవేంద్రరావుతో బాలకృష్ణ ముచ్చట్లు ఓ రేంజ్లో ఉన్నాయి.సెలబ్రేటింగ్ 90 ఇయర్స్ ఆఫ్ తెలుగు సినిమా’ అంటూ నందమూరి తారక రామారావు కటౌట్లు చూపిస్తూ ప్రోమోను స్టార్ట్ చేయగా, ‘‘తెలుగు సినిమా పొత్తిళ్లలో పుట్టినవాళ్లు, సినిమానే ప్రపంచంగా పెరిగినవాళ్లు ఇవాళ మన నిర్మాతలు’’ అంటూ అల్లు అరవింద్, సురేష్ బాబును స్టేజ్ మీదకు ఆహ్వానించారు బాలయ్య. ‘‘నాకు మీ ఇద్దరినీ చూస్తుంటే భలే దొంగ, మంచి దొంగ.. ఇలాంటి దొంగ సినిమాలన్నీ గుర్తుకొస్తాయి’’ అని తనదైన శైలిలో పంచ్లు వేసారు బాలకృష్ణ.
‘సురేష్ బాబు గారితో నా అనుబంధం మీకు తెలిసే ఉంటుంది. ఇక పాయింట్ ఏంటంటే మనిద్దరి కాంబినేషనే బ్యాలెన్స్’’ అని అల్లు అరవింద్ను బాలయ్య అడగడంతో ఆయన స్పందిస్తూ… ‘మీరు, చిరంజీవి గారి కాంబినేషన్లో సినిమా తీద్దామని వెయిట్ చేస్తున్నాను’’ అని అన్నారు. ‘‘అది పాన్ వరల్డ్ సినిమా అవుతుంది’’ అని బాలయ్య చెప్పడంతో సెట్లో ఉన్న ప్రేక్షకులు అరుపులు, కేకలతో హోరెత్తించారు. సాధారణంగా చిరంజీవి, బాలకృష్ణ మధ్య పోటీ గట్టిగా ఉంటుంది. అలాంటిది వీరిద్దరు కలిసి సినిమా చేస్తే ఏ రేంజ్లో ఉంటుందో మనం ఊహించుకోవచ్చు