Chiranjeevi-Garikapati : చిరంజీవిని స్టేజీ మీద ఆ మాట అన్న తరవాత ఫస్ట్ టైమ్ మీడియా ముందుకు వచ్చిన గరికపాటి.!

Chiranjeevi-Garikapati : రెండు రోజుల క్రితం చిరంజీవి – గరికపాటి ఎపిసోడ్ లో రాచుకున్న నిప్పు రవ్వ ఇంకా రగులుతూనే ఉంది..! తాజాగా గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్లో ను కనిపించింది.. సక్సెస్ మీట్ వేదికపై వచ్చిన వక్తలు అందరికీ గరికపాటి ఎపిసోడ్ ను గుర్తు చేశారు..!! ముందు డైరెక్టర్ బాబి ఆ తరువాత చిరంజీవి వీరభక్తుడు చోట కే నాయుడు ఆ ఎపిసోడ్ కి ఆజ్యం పోసారు..! ఇంత జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు ఉన్న గరికపాటి మళ్ళీ మీడియా ముందుకు రానున్నారని తెలుస్తుంది..!

After Chiranjeevi said that on stage, Garikapati came forward to the media for the first time
After Chiranjeevi said that on stage, Garikapati came forward to the media for the first time

బాబి మాట్లాడుతూ.. చిరంజీవి గారు ఆ మధ్య నిశ్శబ్ద విస్పోటనం అన్నారు.. ఆ మాట విలువ రెండు రోజుల క్రితమే తెలిసింది.. ఎవడు పడితే వాడు చిరంజీవి గారికి సరిసాటి రాని వాడు కూడా.. తన పని తాను చేసుకుంటూ ఆ క్షణం అలా అవుతున్న తన పనికి వెళ్తున్నారు చూశారా.. అది చిరంజీవి అంటే.. అంటూ గరికపాటి ఎపిసోడ్ ను పరోక్షంగా గుర్తుకు తెచ్చారు.. చిరంజీవి వీరభద్రుడు చోట కె నాయుడు కూడా కాస్త ఘాటుగా వ్యాఖ్యానించారు.. ఆయన అన్న మాటలు వింటే చిరంజీవి అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది.. అలాయి బలాయి కార్యక్రమంలో రాజుకున్న నిప్పు రవ్వతో.. గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ లో ఆ నిప్పురవ్వ మళ్లీ ఆ నిప్పు మళ్లీ రాచుకిని రగులుకుని చలి మంట కాచుకునే వరకు వెళ్లింది..

గరికపాటి గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ లో తనని ఎక్కువగా టార్గెట్ చేశారనే ఫీలింగ్ లో ఆయన ఉన్నారని.. త్వరలోనే తను ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టనున్నారని తెలిసింది.. అయితే ఆ ప్రెస్ మీట్ లో గరికపాటి చిరంజీవికి క్షమాపణలు చెబుతారా.. లేదా చిరంజీవి ఫ్యాన్స్ తనని ఎక్కువగా టార్గెట్ చేస్తూన్నారు అని అంటారా అనేది చూడాలి.. మొత్తానికి ఈ ఎపిసోడ్ అంత త్వరగా ముగిసేటట్టు లేదనేది నెటిజన్ల వాదన..!