Telangana : తెలంగాణ కాలేజ్ విద్యార్థులకు ఫ్లాష్ న్యూస్..!

Telangana : తెలంగాణలోని ఇంటర్మీడియట్ సిలబస్ పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న వార్షిక పరీక్షలతో పాటు సప్లిమెంటరీ పరీక్షలను కూడా 100% సిలబస్ తోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.. ప్రభుత్వం తరఫున ఇంటర్మీడియట్ బోర్డు కూడా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడం జరిగినది. అంతేకాకుండా 100% సిలబస్ తో కూడిన ఇంటర్ ప్రశ్నాపత్రాలను బోర్డు వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు కూడా ఆయన ప్రకటించారు.

గతంలో లాక్ డౌన్ పరిణామాల కారణంగా గత రెండు సంవత్సరాల నుంచి విద్యార్థులకు కేవలం 70% సిలబస్ తోనే బోధన అలాగే పరీక్షలను కూడా నిర్వహించారు. అప్పుడు తగినన్ని రోజులు క్లాసులు కూడా నిర్వహించలేని పరిస్థితులు నెలకొన్న సందర్భంగా విద్యార్థులపై ఒత్తిడి భారం పడకుండా ప్రభుత్వం కేవలం 70% సిలబస్ తోనే విద్యా బోధన అలాగే పరీక్షలు నిర్వహించింది. అయితే ఈ విద్యా సంవత్సరం ఎలాంటి అవాంతరాలు లేకుండా సజావుగా ప్రారంభమై తరగతులు కొనసాగుతున్నాయి. ఇక జూన్ 15 నుండి కాలేజీలు ప్రారంభం అయ్యాయని , త్వరలోనే విద్యార్థులకు 100% సిలబస్ బోధన కూడా పూర్తవుతుందని

Flash news of Telangana College students 
Flash news of Telangana College students

ఈ క్రమంలోని ఇంటర్ బోర్డు అధికారులు ప్రభుత్వానికి తెలియజేయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సిలబస్ పై విద్యాశాఖ ఉన్నతాధికారులు అలాగే నిపుణులతో సమీక్షించిన ప్రభుత్వం వారి సూచనల మేరకే 100% సిలబస్ బోధన అలాగే పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. వచ్చే ఇంటర్ వార్షిక పరీక్షలను అలాగే సప్లిమెంటరీ పరీక్షలను కూడా 100% సిలబస్ తో పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించబోతున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక వెంటనే విద్యార్థులు కూడా అలర్ట్ అయ్యి 100% పరీక్షలకు సిద్ధం కావాలని కూడా సూచిస్తోంది.