Manchu Lakshmi : రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన వెండితెర అద్భుతం బాహుబలి.. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ కి అమితమైన రెస్పాన్స్ వచ్చింది.. రమ్యకృష్ణ చేసిన శివగామి పాత్ర సినిమా చరిత్రలో నిలిచిపోయేలా చేశారు. కానీ ఈ పాత్ర కు రమ్యకృష్ణ కంటే ముందు చాలా మందిని ఈ పాత్ర కోసం రాజమౌళి సంప్రదించారన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే చాలా సార్లు చెప్పారు. ఆ లిస్టులో మంచు లక్ష్మి కూడా ఉన్నారట.. మంచు లక్ష్మి నీ రాజమౌళి అడగగా.. నేను చేయనని చెప్పిందట మంచు లక్ష్మి..
ప్రభాస్కు తల్లిగా నేను చేయాలనుకోలేదు. మనం ఒక పాత్ర పోషించిన తరవాత దానిలోనే జీవిస్తాం. నేను ఆ పాత్రను డిఫైన్ అవ్వాలనుకోలేదు. ఆ సినిమా అంత పెద్ద హిట్ అయ్యాక నిజానికి నేను చాలా గర్వపడ్డాను. హమ్మయ్యా.. ఆ సినిమా నేను చేయలేదు అనుకున్నాను. బాహుబలి ప్రత్యేకమైన సినిమా కావచ్చు.. అయితే ఆ పాత్రకు నేను కరెక్ట్ అని అనిపించలేదు. నా లైఫ్, నా కెరీర్ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాను.. కానీ నేను నటించిన అనగనగా ఒక ధీరుడు సినిమాలో చేసినా ఐరేంద్రి లాంటి క్యారెక్టర్ ఇంకోటి రాలేదు, రాబోదు కూడా’’ అని మంచు లక్ష్మి ఓ యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు..
మంచు లక్ష్మి ఇప్పటివరకు తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో నటించారు.. తాజాగా తను ఇప్పుడు మలయాళ ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. మోహన్లాల్ హీరోగా వస్తోన్న మాన్స్టర్ సినిమాలో మంచు లక్ష్మి నటించారు. ఈనెల 21న ఈ సినిమా విడుదల కాబోతోంది. మోహన్లాల్ లాంటి స్టార్ హీరో ఈ సినిమాలో తను నటించినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.. మంచి లక్ష్మి ఆ సినిమాతో మలయాళ తెరకు పరిచయం అవ్వడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు మంచు లక్ష్మి.. అయితే ఈ సినిమాతో మలయాళ ప్రేక్షకులకు ఏ మేరకు దగ్గరవుతారు అనేది చూడాలి..