Nayanthara : తెలుగు సినిమా అంటే నయనతార కి పిచ్చ లైట్ ఆ ? సీరియస్ అవుతోన్న తెలుగు సినిమా ఫ్యాన్స్ !

Nayanthara : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నయనతారకు ప్రత్యేకమైన గుర్తింపు పొంది.. ముఖ్యంగా సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార ఇండస్ట్రీలోకి వచ్చి 19 సంవత్సరాలు అవుతున్నా.. ఆమె మాత్రం తన హీరోయిన్ స్థానాన్ని చెదరకుండా కాపాడుకుంటూ వస్తున్నారు. ఇకపోతే నయనతార గురించి ఎప్పుడూ ఒక వార్త వైరల్ అవుతూ ఉంటుంది .. ఆమె ప్రమోషన్స్ కి రాదు అని.. నిజానికి తానే స్వయంగా ప్రొడ్యూస్ చేసుకున్న సినిమాలైనా సరే ఇతర బ్యానర్ లో హీరోయిన్ గా నటించినా సరే ఏ సినిమాలకైనా సరే ఆమె ప్రమోషన్లకు మాత్రం హాజరవ్వరు. బడా నిర్మాతలు కూడా ఈమెను ప్రమోషన్ల కోసం తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు చేపట్టిన ఆమె మాత్రం ప్రమోషన్స్ కి దూరంగా ఉంటూ వస్తుంది.

అంతేకాదు కథలు వినే సమయంలో కూడా ఇలాంటి కండిషన్ కి దర్శక నిర్మాతలు అంగీకరిస్తేనే సినిమాలలో నటిస్తాను అని నియమాలు కూడా పెడుతూ ఉంటారు. కానీ 2020 తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రమోట్ చేస్తే కానీ సినిమా రీచ్ అవ్వట్లేదు.. అందుకే రాజమౌళి లాంటి అగ్ర దర్శకులు కూడా తమ సినిమా విడుదల చేస్తున్నారు అంటే నెలల పాటు ప్రమోట్ చేస్తున్నారు. కనీసం ఇప్పటికైనా మన స్టార్ హీరోయిన్ లో మార్పు వస్తుందనుకుంటే తన పందా మాత్రం వీడనంటుంది. గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాలో చిరంజీవి మొదటి భార్య పాత్రలో నటించింది నయనతార . అప్పట్లో కూడా ఈమె ప్రమోషన్లకు రాలేదు.ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి ఒక సందర్భంలో చెప్పారు . ఇక ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవికి చెల్లి పాత్రలో కనిపించిన ఈమెను ప్రమోషన్లకు రావాల్సిందిగా సినిమా టీం కోరిందట.కనీసం సక్సెస్ మీట్ కైనా రావాలని కోరారట. అయితే బిజీగా ఉన్నానని చెప్పేసింది.

Telugu movie fans serious on Nayanthara 
Telugu movie fans serious on Nayanthara

ఇకపోతే మరోసారి ఆమెకు కాల్ చేస్తారేమో అని భావించి వెంటనే అభిమానులకు ఒక లెటర్ రాసేసింది. గాడ్ ఫాదర్ లో చేసినందుకు చాలా సంతోషంగా ఉందని, మెగాస్టార్ వంటి గొప్ప వ్యక్తితో పని చేయడం తనకు కలిగిన గొప్ప భాగ్యం అని, మొత్తం టీమ్ ను ఆకాశానికి ఎత్తేస్తూ.. ఈమె ఒక ప్రెస్ నోట్ పంపింది. ఎప్పుడూ ఇలాంటివి చేయనీయని ఈమె ఇలా సరికొత్తగా ప్రెస్ నోట్ వదలడంతో అందరిలో అనుమానాలు వ్యక్తమయ్యాయి.. కానీ ఆరా తీయగా ఆమె ఎప్పటిలాగే తన పంతాన్ని వదులుకోలేక.. ప్రమోషన్స్ కి రాలేక.. ఇలా ప్రెస్ నోట్ వదిలినట్టు సమాచారం. కనీసం ఇప్పటికైనా మారాలని అభిమానులు మాత్రం కోరుకుంటున్నారు. కానీ ఆమె ఎందుకు ఇలా చేస్తున్నారో ఎవరికి అంతు చిక్కకపోవడమే ఆశ్చర్యకరం. అయితే ఈ విషయంపై తెలుగు అభిమానులు మాత్రం నయనతార పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకు సినిమా ప్రమోషన్లకు రావట్లేదు ..తెలుగు సినిమా అంటే అంత లైట్ ఆ అన్నట్టుగా తమ వాదనలను వినిపిస్తున్నారు.