Adipurush : రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా తెరకెక్కిస్తున్న మరొక పాన్ ఇండియా చిత్రం ఆది పురుష్.. రామాయణ ఇతిహాస కథ ఆధారంగా 3D ఫార్మాట్ లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడిగా బాలీవుడ్ స్టార్ ఓం రౌత్ వ్యవహరిస్తున్నారు. టి సిరీస్ బ్యానర్ పై దర్శకుడు ఓం రౌత్ తో పాటు భూషణ్ కుమార్ , క్రిషన్ కుమార్ తో పాటు రాజేష్ మోహనన్ సంయుక్తంగా ఈ పాన్ ఇండియా సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో రాఘవుడిగా ప్రభాస్, జానకిగా కృతి సనన్, లంకేష్ పాత్రలో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను సుమారుగా రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
ఇకపోతే ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్స్ గా నార్త్ ఇండియాలో ఏ ఏ ఫిలిమ్స్ వారు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండగా.. తెలుగులో UV క్రియేషన్స్ వారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా రిలీజ్ కి ముందే కొన్ని వందల కోట్ల ప్రాఫిట్ తో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఆది పురుష్ సినిమా టీజర్ విడుదల చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా టీజర్ పై రకరకాలుగా రూమర్స్, ట్రోలర్స్ సృష్టించారు. ఇలా ఉందంటే సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుందని.. ఇలాంటి సినిమాపై రూ.500 కోట్ల బడ్జెట్ ఎలా పెట్టారు? అని రకరకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కానీ ఇలాంటి వాళ్లందరి ఆలోచనలను తిప్పికొడుతూ ఆదిపురుష్ సినిమా విడుదలకు ముందే లాభాల బాట పట్టింది.
ప్రీ రిలీజ్ తోనే సుమారుగా రూ.600 కోట్ల లాభంతో దూసుకుపోతోంది ఈ సినిమా. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. డిజిటల్ రైట్స్ రూ.500 కోట్లకు అమ్ముడుపోగా, సాటిలైట్ రైట్స్ రూ.400 కోట్లు, మ్యూజిక్ రైట్స్ రూ.60 కోట్లు , ఇంటర్నేషనల్ రైట్స్ రూ.200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా చూసుకుంటే సినిమా రిలీజ్ కి ముందే రూ. 1100 కోట్ల రికవరీతో దూసుకుపోతూ ఉండడం గమనార్హం . మరి రిలీజ్ అయిన తర్వాత ఈ బిజినెస్ లెక్కలు మరింత మారే అవకాశం ఉంది. ఫ్లాప్ అవుతుందని ప్రచారం చేసే వాళ్ళకి ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే అర్థమవుతుంది..ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అని..