Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు అనే విషయం తెలిసిందే. ఆయన ఇటీవలి కాలంలో వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. చివరిగా సర్కారు వారి పాట చిత్రంతో పలకరించిన మహేష్ బాబు ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో తన తల్లి చనిపోయింది. ఆమె మరణాన్ని మహేష్ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం మహేష్ అదే బాధలో ఉండగా, ఇప్పుడు ఆయనకు మరో దెబ్బ తగిలింది. త్రివిక్రమ్ తో చేస్తున్న మూవీకి సంబంధించి స్టోరీ లీక్ అయిందని అంటున్నారు. ఈ సినిమా స్టోరీ గతంలో సల్మాన్ ఖాన్ నటించిన ‘భజరంగి భాయిజాన్ ‘ లాగా ఉందంటూ ముచ్చటించుకుంటున్నారు.
Mahesh Babu : ఫ్యాన్స్ అప్సెట్..
ఈ సినిమాలో మహేష్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. లాంగ్ హెయిర్, గడ్డంతో రఫ్ గా కనిపించనున్నాడని తెలుస్తుండగా, ఇప్పటికే ఆయన లుక్ కి సంబంధించిన పిక్స్ విడుదల అయ్యాయి. ఇవి చూసి ఫ్యాన్స్ థ్రిల్ అయ్యారు.మరోవైపు ఆయన సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా కనిపించనున్నాడనే ప్రచారం కూడా నడుస్తుంది. అయితే మూవీ లో హీరో ఒక పాత్ర ను కాపాడే ప్రయత్నాలు చేస్తుండగా, ఆ పాత్రకు మహేష్ కుమార్తెను తీసుకోవాలి అనుకుంటున్నట్లు ఫిలింనగర్ లో కొన్ని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. సితార ఇప్పటికే సర్కారు వారి పాట సినిమా కోసం ప్రమోషనల్ సాంగ్ లో నటించిన విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ చిన్నారికి యాక్టింగ్, డ్యాన్స్లో శిక్షణ కూడా ఇప్పిస్తున్నారు. సితార ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ నెటిజన్స్ని అలరిస్తుంది. ఈ చిన్నారి ఏ పోస్ట్ చేసిన కూడా కొద్ది క్షణాలలో వైరల్ అవుతుంది. ఆ మధ్య మహేష్ బాబు తన కూతురిని హీరోయిన్గా చేస్తానంటూ ఇన్డైరెక్ట్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక మహేష్ తన తనయుడు గౌతమ్ని 1 నేనొక్కడినే చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇప్పుడు సితార టైం రావడంతో ఆమెని పరిచయం చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు. త్రివిక్రమ్ సినిమాతోనే సితార వెండితెర ఎంట్రీ ఉంటుందని తెలుస్తుండగా, ఈ సినిమా కోసం