Jio Offer : దేశంలోనే దిగ్గజ టెలికాం సంస్థలలో ఒకటైన రిలయన్స్ జియో గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక దేశవ్యాప్తంగా విరివిగా ఉపయోగిస్తున్న నెట్ వర్క్ లో నెంబర్ వన్ టెలికాం సంస్థ జియో అని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఈ క్రమంలోనే జియో కూడా తమ కష్టమర్లను ఆకర్షించడానికి ఎప్పటికప్పుడు సరికొత్త బంపర్ ఆఫర్లను ప్రకటిస్తూ కస్టమర్లను బాగా ఆకర్షిస్తుంది. చౌక ధరకే రీఛార్జి ప్లాన్స్ ని అందిస్తూ మరింత కష్టమర్లకు దగ్గరైన జియో ఇప్పుడు ఏకంగా 20 జిబి ఫ్రీ ఇంటర్నెట్ డేటాను అందించడానికి సిద్ధమయింది. ఇక ఈ 20 జిబి ని ఉచితంగా పొందాలి అంటే ఏం చేయాలి అనే విషయాలను ఇప్పుడు ఒకసారి మనం చదివి తెలుసుకుందాం.
రిలయన్స్ జియో సంస్థ దేశంలోనే నెంబర్ వన్ టెలికాం సంస్థగా మారడానికి కారణం? కొత్త కస్టమర్లు జియో వైపు రావడానికి అసలు కారణం ఏమిటంటే? నాణ్యమైన సేవలు సంచలనమైన ఆఫర్లు ఇందుకు కారణమని చెప్పవచ్చు. ఇకపోతే జియో కస్టమర్లు 20 gb ఉచిత డేటాను పొందడం కోసం ఎటువంటి రీచార్జి ప్లాన్లను కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. ఇక ఏదైనా ఇది అదనపు ఆఫర్లో భాగం కూడా కాదు . మీరు కేవలం జియో యొక్క ఆఫర్ పొందాలి అంటే మీ స్మార్ట్ ఫోన్లో జియో యొక్క అధికారిక యాప్ మై జియో యాప్ ను ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది. ఇక ఈ యాప్ ద్వారా మీరు 20 gb డేటాను ఉచితంగా పొందవచ్చు. ప్రస్తుతం రిలయన్స్ జియో మై జియో యాప్ లో లక్కీ డ్రాను నిర్వహిస్తోంది.
ఇక ఇందులో మీరు పాల్గొనడం ద్వారా 20జిబి ఇంటర్నెట్ ను ఉచితంగా పొందవచ్చు. ఇందులో జూలై 15 వరకు పాల్గొనే అవకాశం ఉంది. కాబట్టి లక్కీ డ్రాలో ఐదుగురు వ్యక్తులు 20 gb డేటాను గెలిచే అవకాశం పొందుతారు. ఇక ఈ లక్కీ డ్రాలో ఎలా పాల్గొనాలి అంటే జియో యొక్క ఈ ఉచిత 20జిబి డేటాను పొందాలనుకుంటే.. మీరు ముందుగా మీ స్మార్ట్ ఫోన్ లో ఉన్న మై జియో ఆప్ ని ఓపెన్ చేయాలి. ఇక హోమ్ స్క్రీన్ ను కొద్దిగా కిందకు స్క్రోల్ చేస్తే మీకు ప్లే అండ్ విన్ అనే ఒక విభాగం కనిపిస్తుంది. అందులో మొదటి ఆప్షన్ గా 20 gb డేటా లక్కీ డ్రా ఉంటుంది. ఆప్షన్ పై క్లిక్ చేసి వెంటనే మీకు పార్టిసిపేట్ నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక దానిపై క్లిక్ చేసిన తర్వాత మీరు ఒక ప్రశ్నకు సరిగ్గా సమాధానం ఇస్తే ఆ తర్వాత లక్కీ డ్రా కోసం నమోదు చేయబడతారు. జూలై 15వ తేదీన విజేతలను కూడా ప్రకటిస్తారు.