Potti Sreeramulu: చరిత్ర నిజాలు :ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములుప్రాణ త్యాగం తర్వాత ఆయనకు జరిగిన అవమానం తెలిస్తే కన్నీళ్లు ఆగవు !!

Potti Sreeramulu: పొట్టి శ్రీరాములు జననం:
పొట్టి శ్రీరాములు 1901 వ సంవత్సరం లో మార్చి 16న మద్రాస్ , జార్జిటౌన్ లో ఉన్న అణ్ణాపిళ్ళే లో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. వారి పూర్వీకులది ప్రస్తుత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని పడమటి పాలెం గ్రామం గా చెప్పబడింది. ఇరవై యేళ్ళ వరకు శ్రీరాములు విద్యాభ్యాసంమద్రాసు లోనే కొనసాగింది. తరువాత బొంబాయి లో శానిటరీ ఇంజనీరింగు పూర్తి చేసిన తరువాత గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే లో చేరి దాదాపు నాలుగేళ్ళ పాటు అక్కడ ఉద్జ్యోగం చేసారు. అప్పటిలో అయన జీతం నెలకు 250 రూపాయలు గా ఉండేది.


Potti Sreeramulu:  శ్రీరాములు వైవాహిక జీవితం:

1928 వ సంవత్సరం లో శ్రీ రాములు దంపతులకు కలిగిన ఒక బిడ్డ చనిపోయాడు. ఆ తరువాత కొద్ది రోజులకేఆయన భార్య కూడామరణించింది. 25 సంవత్సరముల వయసు కలిగిన శ్రీరాములు జీవిత సుఖాలపై విరక్తి చెంది ఉద్యోగానికి రాజీనామా చేసాడు. ఆస్తిపాస్తులను తల్లికి, అన్నదమ్ములకు ఇచ్చేసి గాంధి జీని అనుసరిస్తూ సబర్మతి ఆశ్రమం లో చేరి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనడం అనేది జరిగింది.

జైలుశిక్ష :

పొట్టి శ్రీరాములు 1930వ సంవత్సరం లో ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొని జైలుశిక్ష కూడా అనుభవించారు.. తర్వాత మళ్ళీ 1941-1942 సంవత్సరాల్లో సత్యాగ్రహాలు, క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొనడం వల్ల మూడుసార్లు జైలుశిక్ష అనుభవించారు. 1985 వ సంవత్సరం లో ప్రచురింప బడిన ఆంధ్ర ఉద్యమం కమిటీ అధ్యయనంలో పొట్టి శ్రీరాములు మరియు మహాత్మా గాంధీల మధ్య ఉన్న అనుబంధం గురించి ఇలా వ్రాయడం జరిగింది. – సబర్మతి ఆశ్రమంలో శ్రీరాముల సేవ చరిత్రాత్మకమైనది. ప్రేమ తో పాటు వినయం, సేవ, నిస్వార్ధత లు మూర్తీభవించిన స్వరూపమే శ్రీరాములు గా చెప్పబడినది.

ప్రపంచానికే గురువు:

ఆయన గురువు ప్రపంచానికే గురువు, సత్యాన్ని, అహింసను ఆరాధించే ప్రేమమూర్తి ఆయన . దరిద్ర నారాయణుల ఉద్ధతి కోసమే అంకితమైన మహానుభావుడుగా చెప్పవచ్చు….. శ్రీరాములు తన కర్తవ్య లను ఉత్సాహంగా నిర్వహిస్తూ ఆశ్రమంలో అందరి మన్ననలనూ, గాంధీ ఆదరాన్నీ కూడా పొందగలిగారు.

కులమతాల పట్టింపులు :

ఆంధ్రలో కృష్ణ జిల్లాలోని కొమరవోలులోను గ్రామ పునర్నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొమరవోలులో యెర్నేని సుబ్రహ్మణ్యం స్థాపించిన గాంధీ ఆశ్రమంలో చేరాడు. 1943-1944 లో నెల్లూరు జిల్లాలో చరఖా వ్యాప్తికి పట్టుదలతో కృషిచేసారు. కులమతాల పట్టింపులు అనేవి లేకుండా ఎవరి ఇంట్లోనైనా భోజనం చేసేవారు. 1946 వ సంవత్సరం లో నెల్లూరు మూలపేటలోని వేణుగోపాలస్వామి ఆలయంలో హరిజనుల ప్రవేశంకోసం నిరాహారదీక్ష చేసి సఫలం అయ్యారు. ఇంకొకసారి కూడా నిరాహారదీక్ష చేసి, మద్రాసు ప్రభుత్వం చేత హరిజనోద్ధరణ శాసనాలను ఆమోదించేలా చేసాడు. దీని ఫలితంగా వారంలో కనీసం ఒకరోజు హరిజనోద్ధరణకు కృషి చెయ్యవలసిందిగా ప్రభుత్వం కలెక్టర్లకు ఉత్తరువులు జారీచేసింది.

శ్రీరాములు వంటి కార్యదీక్షాపరులు పదిమంది ఉంటే:

గాంధీజీకి శ్రీరాముల మీద ఒక ప్రత్యేకమైన అభిమానంతో పాటు ఆయన మంకుతనం మీద కాస్త చిరాకు కూడా ఉండేవిఉండేది. శ్రీరాములు వంటి కార్యదీక్షాపరులు పదిమంది ఉంటే ఒక్క సంవత్సరంలోనే స్వతంత్రం సాధించవచ్చునని గాంధీజీ నే స్వయం గా అనేవారు. 1946 వ సంవత్సరం నవంబరు 25న ఈ గాంధీ శిష్యుడు మద్రాసు ప్రొవిన్సులోని అన్ని దేవాలయాలలోనూ హరిజనులు ప్రవేశించేలా చేయాలి అని ఆమరణ నిరాహార దీక్షను మొదలు పెట్టారు.కొద్దీ రోజుల్లోనే స్వాంతంత్ర్యం రావచ్చునన్న ఆశాభావంతో కాంగ్రెస్ నాయకులు, సభ్యులందరి దృష్టీ ఆ స్వాతంత్ర్యోద్యమంపైనే ఉంది. కాబట్టి శ్రీరాములు దీక్షను మానుకోవాలని వారు సూచించినా ఆయన వినకపోయేసరికి గాంధీ కి విషయం తెలియచేసారు . ఎలాగో గాంధీ శ్రీరాములుకు నచ్చజెప్పి దీక్ష విరమించేలా చేసారు.

ఆంధ్రోద్యమంపై:

1952 వ సంవత్సరం లో శ్రీరాములు దీక్ష మాన్పించడానికి గాంధీజీ జీవించి లేరు.ఒకవేళ ఉన్నాగాని ఆంధ్రోద్యమంపైఆయనకు ఉన్న దృఢత్వం ఎవ్వరు కద పలేనిది. జీవితం చివరిదశలో నెల్లూరు లో ఉంటూ, హరిజనోద్ధరణకు మరింత కృషిచేసారు . దీనిగురించిన నినాదాలను అట్టలకు మీద రాసి, మెడకు వేసుకుని మరి ప్రచారం చేసేవాడు. కాళ్ళకు చెప్పులు, తలకు గొడుగు లేకుండా మండుటెండ ని సైతం లెక్క చేయకుండా తిరుగుతూ ప్రచారం చేసే ఆయన్ను పిచ్చి వాడు అని కూడా అన్నారు. ఆ పిచ్చివాడే ఆంధ్రుల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణత్యాగానికి పూనుకుని, అమరజీవి గా మిగిలారు.

ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు :

మద్రాసు రాజధానిగా వుండే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు మద్రాసులో 1952 వ సంవత్సరం అక్టోబర్ 19 న బలుసు సాంబ మూర్తి ఇంట్లో నిరాహారదీక్ష ను మొదలు పెట్టారు. అతి సాధారణం గా మొదలైన దీక్ష, క్రమంగా ప్రజల్లో అలజడి కి కారణం గా మారింది. ఆంధ్ర కాంగ్రెసు కమిటీ మాత్రం దీక్షను అసలు సమర్ధించలేదు. ప్రజలు మాత్రం శ్రీరాములుకు మద్దతుగా సమ్మెలు, ప్రదర్శనలు చేసారు. కానీ ప్రభుత్వం మాత్రం రాష్ట్రం ఏర్పాటు దిశగా స్పష్టమైన ప్రకటన అనేది ఏది చెయ్యలేదు.

ఆరోగ్యం క్షీణస్తూ..

రోజులు గడుస్తున్నా కొద్దీ తన ఆరోగ్యం క్షీణస్తూ ఉంటే శ్రీరాములులో మనోధైర్యం మాత్రం రెట్టింపు అవుతూ ఉండేది. నా ఆరోగ్యానికి ఏమీ ఢోకాలేదు అని ఆయన ఉత్తరాల్లో పదే పదే చెప్తుండేవారు. నవంబరు 27వ తేదీ వచ్చేసరికి శ్రీరాములు ఇంట్లోనే కొద్దికొద్దిగా తిరుగుతూ అవసరాన్ని బట్టి మాట్లాడుతూ ఉండడం అనేది జరిగేది. ఆ తర్వాత,తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించసాగింది. వార్తా పత్రికల్లో కూడా ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతూ ఉండేది. డాకర్లు వచ్చి రక్త పరీక్షలు కూడా చేశారు. నిద్రపోయే సమయంలో కాకుండా ఆయనకు ఎల్లప్పుడూ నోట్లో లాలాజలం కారుతుండేది. నిమిష నిమిషానికి చొంగ కారుతూనే ఉండేది. తరచూగా వాంతులు అవుతూ ఉండేవి. ఎక్కిళ్ళు , తుమ్ములు ఇబ్బంది పెడుతూ ఉండేవి. అప్పటికే ఆయన అలసి పోయి ఉండడం పైగా వాంతులు, తుమ్ములతోచాలా కష్టంగా ఉండేది. డిసెంబరు 5వ తారీఖు నాటికి ఎక్కిళ్లు, తుమ్ములు తగ్గినా కూడా శీతవిరోచనాలు అయ్యేవి. దాంతో మరింత నీరసించిపోయారు. శిబిరంలో ఉన్నవారందరూ అందరూ కంగారుపడ్డారు. నిరాహారదీక్షకు కూర్చునేముందే ఆయన రోజుకు మూడుసార్లు నీటిలో నిమ్మకాయరసం, కొంచెం తేనె కలిపి తీసుకుంటానని తెలియచేసారు. ఇప్పుడు అవి తీసుకుంటున్న కూడా వాంతులు అయిపోయేవి. కొన్నికొన్ని సందర్భాల్లో రక్తం పడేది. ఇక ఆత్మార్పణ వారం రోజులు ఉందనగా శ్రీరాములు గారు పూర్తిగా లేవలేని, మాట్లాడలేని స్థితికి చేరుకున్నారు. డిసెంబరు వలన విపరీతంగా చలి కారణం గా ఆయన వణుకుతుంటే ఎప్పుడూ చొక్కా వేసుకోని శ్రీరాములుకు చొక్కా వేశారు.

డాక్టర్స్ మాట కూడా వినలేదు :

ఆయన బాగా నీరసించిపోవడంతో గ్లూకోజ్ ఇవ్వాలని డాకర్లుసూచించారు. అప్పటికే మాట్లాడలేని స్థితిలో ఉన్న కూడా వద్దని చేయి ఊపుతూ చెప్పేవారు. ఉద్యమం ఉధృతం కావడం, ప్రభుత్వం స్పందించకపోవడం, ఆయన రోజురోజుకూ నీరసించి పోవడం తో ఓరోజు బులుసు సాంబమూర్తి తో నరసింహలతో మాట్లాడారు. క్రమక్రమంగా దేహం బలహీనం అయ్యి, స్పృహ తప్పి పోయినా దీక్ష నిర్విఘ్నంగా కొనసాగాలని కోరుకున్న మహా మనిషి శ్రీరాములు గారు. స్పృహ లో లేనప్పుడు ఎవరూ బలవంతంగా ఇంజెక్షను ద్వారా ఆహారం శరీరం లో కి ఎక్కించ వద్దని ఆయన చెప్పారు. అప్పటికే రాష్ట్రంలో జరుగుతున్న అల్లరును ఆయన తీవ్రం గా వ్యతిరేకించారు.

ఆత్మార్పణ రోజు:

డిసెంబర్ 15 శ్రీరాములు గారి ఆత్మార్పణ రోజు .. ఉదయం నుంచే ఆయన స్పృహలో లేరు. కళ్లు తెరిచినా అంతలోనే మూతలు పడపోయేవి. చేతులు కదిపేందుకు కూడా శక్తి లేకుండా పోయినది. 15.8 కేజీల వరకు బరువు తగ్గారు. నాడి కదలిక, శ్వాసతీరుల్లో చాలా మార్పు వచ్చింది. 16 గంటలపాటు మూత్రం స్తంభించిపోయింది. నోటిమాట కూడా కష్టమైంది. అప్పుడప్పుడు అపస్మారకంలోకి వెళ్ళిపోయేవారు. సందర్శకులను నిలిపివేశారు. ఆ సాయంత్రం వచ్చిన ప్రకృతి చికిత్సకులు వేగిరాజు కృష్ణమరాజు, ఆయన సతీమణులతో మాట్లాడలేకపోయినా కూడా చిరునవ్వుతో స్వాగతం పలికారు. అప్పటి నుంచి క్రమంగా శరీరం చల్లబడిపోయి రాత్రి 11.23 గంటలకు పొట్టి శ్రీరాములుగారు ఆంధ్రరాష్ట్రం కోసం తనను తాను బలిదానం చేసుకొన్నరు .

మరణం తర్వాత ఘోరమైన పరిస్థితి:

ఇక మరణించాక పరిస్థితి మరీ దారుణం గా తయారయినది. తెలుగువారి యొక్క హీన దీన హైన్య చాతకానితనం ఎలాంటిది అంటే , ఆయన శవాన్ని ముట్టుకోవడానికి కూడా నలుగురు తెలుగువాళ్ళు ముందుకు రాలేదు. ఆయన మన తెలుగువారి కోసమే మరణించారు అని తెలిసినా కూడా ఎవరు స్పందించలేదు. చివరి వరకు దీక్షలో తోడుగా ఉన్న సాధు సుబ్రమణ్యం కనీసం మన గుడివాడ వాళ్ళవైనా సహాయం అడిగి శవదహనం చేద్దామని ఆశయాన్ని చంపుకుని వ్యక్తిగత భిక్షగాడిగా గుడివాడకు చెందిన సినీగాయకుడు అయిన ఘంటసాల దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి మన గుడివాడ నుండి వచ్చాడు గనుక మనమైనా సాగనంపుదాం అని ఒప్పించి తీసుకువచ్చారు. ఘంటసాల వెంట మోపర్రు దాసు అనే ఒక కళాకారుడు నేను గుడివాడ వాడినే కదా నేనూ వస్తానని వచ్చారు. తెలుగుజాతి కోసం తన ప్రాణాలు దానం చేసిన ఆ మహనీయుడి శవాన్ని ఎవరికీ తెలియకుండా తీసుకువెళ్ళటం సరైన పని కాదు అని తెలుగువాళ్ళ కళ్లు తెరిపించడానికి ఈ శవమే దిక్కు కావాలని ఒక ఎద్దులబండి మాట్లాడుకుని శవాన్ని అందులోకి ఎక్కించారు. అప్పటికప్పుడే ఆశువుగా ఘంటసాల తన వీరకంఠాన్ని ఎలుగెత్తి తెలుగుజాతి పౌరుషం చచ్చిందని, చీము నెత్తురు లేని తెలుగుజాతి కోసం అసువుల బాసిన శ్రీరాములు నువ్వు అంటూ గొంతెత్తి పాడతూ శవయాత్ర మొదలు పెట్టారు. యేర్నేని సాధు సుబ్రమణ్యం గారే అమరజీవి శ్రీరాములకు దహనక్రియలు కర్మకాండ చేసారు.

ఆంధ్ర రాష్ట్ర అవతరణ :

పొట్టి శ్రీరాములు గారు , ప్రాణాలర్పించటంతో ఆగ్రహావేశులైన ప్రజలు హింసాత్మకచర్యలకు పూనుకున్నారు. మద్రాసు లో జరిగిన ఆయన అంతిమ యాత్రలో నినాదాలతో ప్రజలు ఆయన త్యాగనిరతిని పొగిడారు. తదుపరి జరిగిన పరిణామాలలో మద్రాసు నుండి విశాఖపట్నం వరకు ఆందోళనలు, హింస తారాస్థాయి కి చేరుకున్నాయి. పోలీసు కాల్పుల్లో ప్రజలు మరణించారు. చివరికి డిసెంబర్ 19న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేస్తూ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రు ప్రకటన చేసాడు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే ఒక్క రోజు కూడా ఆంధ్రులు మద్రాసులో రాజధాని పెట్టుకోటానికి ఇక వీల్లేదని మరునాడే వెళ్ళిపోవాలని చక్రవర్తుల రాజగోపాలాచారి తెగేసి చెప్పాడు. అయితే కాకతీయులు పాలించిన వరంగల్లు రాజధానిగా బాగుంటుందని అంబేద్కర్ సూచించారు . రాజమండ్రి కూడా మంచిదేనన్నారు.విజయవాడ కమ్యూనిస్టుల కంచు కోట కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు దానికి ఒప్పుకోలేదు. నెల్లూరు , చిత్తూరు నాయకులు మాకు మద్రాసు దగ్గరగా ఉంది మేము ఆ సౌకర్యం వదులుకోవాలా అని అలిగారు. కోస్తా వాళ్ళను మేము నమ్మం, రాజధాని రాయలసీమ లో పెట్టాలని, లేకపోతే ఆంధ్ర రాష్ట్రమే వద్దని నీలం సంజీవరెడ్డి తదితరులు ఎదురుతిరిగారు. గత్యంతరంలేక కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1న బళ్లారి ,బరంపురం హుస్పేట ,తిరువళ్ళూరు లాంటి తెలుగు ప్రాంతాలు కూడా వదులుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.