Money Plant : మనీ ప్లాంట్ ను ఇంట్లో పెంచితే ధనము వస్తుందని అందరికి తెలుసు. కాని ఏ మూలన పెంచితే అధిక ఆదాయం కలుగుతుందో చాలా మంది కి తెలియదు.కానీ సంపదకు మార్గాన్ని తెరిచే మనీ ప్లాంట్ ఏ దిశలో ఉంచాలి ఇప్పుడు ఒకసారి దాని గురించి తెలుసుకుందాం.మొదటగా మనీప్లాంట్ ని ఇంట్లోకి తెచ్చుకోవాలి అనుకున్నప్పుడే ఆ లక్ష్మి దేవి ఇష్టమైన రోజు శుక్రవారము పూట తెచ్చుకోవాలి.మనీ ప్లాంట్ ను నాటేటప్పుడే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి మొదటగా మనీ ప్లాంట్ ఆరోగ్యావంతంగా ఉందో లేదో చూసుకోవాలి. ఆ తరువాత మొక్క వేసే కుండీ నీలిమరంగులో వున్నది తీసుకోవాలి. అందులో 11రూపాయలు, మట్టివేసి మొక్కను నాటాలి.
ఇలా నాటిన మనీ ప్లాంట్ ని మనకు ఉన్న నాలుగు దిక్కులలో ఒక్కొక్కదిక్కున పెడితే ఒక్కొక్క రకమైన లాభం చేకూరుతుంది. ఈశాన్య దిక్కున పెడితే మానసిక ప్రశాంతత కలుగుతుంది. నైరుతి దిశలో పెడితే అప్పులు అన్ని తీరిపోతాయి. ఉత్తర దిశలో పెడితే ఉద్యోగ లాభం కలుగుతుంది. వాయువ్య దిశలో పెడితే వ్యాపార సంబంధిత, కార్యకలాపాలు బాగా కలిసి వస్తాయి. ఇక మనీ ప్లాంట్ పెంచేటప్పుడు నేల మీదికి పాకే విధంగా కాకుండా కర్ర సహాయంతో కానీ, తాడు సహాయంతో కానీ పైకి అల్లుకు పోయేలాగా పెంచుకోవాలి. మనీ ప్లాంట్ ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా ముట్టుకో రాదు. ఒకవేళ ఏవైనా ఆకులు, పసుపు రంగులోకి మారినప్పుడు వాటిని మొక్క నుండి వేరు చేయాలి.
![If the Money Plant is planted here will the financial wealth increase](https://dailytelugunews.com/wp-content/uploads/2022/02/Money-3.jpg)
మనీ ప్లాంట్ ఎంత ఆరోగ్యంగా పెరిగితే అంత మనశ్శాంతి, అంత ధనలాభం కలుగుతుంది.మనీ ప్లాంట్ కు ప్రతి శుక్రవారం సాయంత్రం ఎదురుగా దీపం వెలిగించి పూజ చేయాలి. శుక్రవారం ఎరుపు దారం కానీ ఎరుపు రంగు బట్ట కానీ తీసుకొని మనీ ప్లాంట్ కడితే మనకు కావాల్సిన ధనం సకాలంలో మన చేతికి అందుతుంది . ఈ ఎరుపు రంగు దారం కానీ బట్ట కానీ మూడు రోజుల తర్వాత తీసివేసి మరలా వచ్చే శుక్రవారం పూట ఈ విధంగానే పూజ చేస్తూ ఉండాలి. ఇక మనీ ప్లాంట్ ని ఎక్కువగా ఆగ్నేయ దిశలో పెంచితే అత్యధిక ధనలాభం కలుగుతుంది .