Prabhas : దీపావళి కి మొగల్తూరు రాబోతోన్న ప్రభాస్, ఆదిపురుష్ హీరోయిన్ కృతి సనన్ ?? త్వరలో పెళ్లి ??

Prabhas : వ‌రుస సినిమా షూటింగ్‌ల‌తో బిజీగా ఉన్న ప్ర‌భాస్ దీపావ‌ళికి మొగ‌ల్తూరు రానున్నాడ‌ట‌. దాదాపు పన్నెండేళ్ల తర్వాత ప్రభాస్ తన సొంత ఊరు మొగల్తూరు వెళ్లిన విష‌యం తెలిసిందే. కృష్ణంరాజు సంస్మరణ సభ ను భారీ ఎత్తున మొగల్తూరులో నిర్వ‌హించ‌గా, ఈ కార్యక్రమం కోసం ప్రభాస్ సొంత ఊరైన మొగల్తూరు వెళ్లాడు. ప్రభాస్ ను చూడటం కోసం పెద్ద ఎత్తున అభిమానులు అతడి ఇంటివద్దకు చేరుకోగా, ప్రభాస్ త‌న అభిమానుల‌ని ఆప్యాయంగా ప‌ల‌క‌రించాడు. 2010లో తండ్రి సూర్యనారాయణ రాజు మరణించిన సమయంలో ప్రభాస్ మొగల్తూరు వెళ్లారు.

ఆ తర్వాత మళ్లీ పన్నెండేళ్ల విరామం అనంతరం సొంత ఊరికి వెళ్లాడు ప్ర‌భాస్. ఇక కొద్ది రోజుల గ్యాప్‌లోనే మ‌ళ్లీ మొగ‌ల్తూరు వెళ్ల‌బోతున్నాడ‌ట ప్ర‌భాస్‌. అయితే ఈ సారి సింగిల్‌గా కాకుండా త‌న కోస్టార్ కృతి స‌న‌న్‌ని తీసుకొని వెళ్ల‌నున్నాడ‌ని ప్రచారం న‌డుస్తుంది. అక్క‌డ త‌న ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంద‌రికి కృతిని ప‌రిచ‌యం చేయ‌నున్నాడ‌ట‌. ఇక ఈ దీపావళిని కృతితో క‌లిసి సెల‌బ్రేట్ చేసుకోబోతున్న ప్ర‌భాస్ త్వ‌ర‌లోనే వారి పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ కూడా చెప్ప‌బోతున్నార‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. మ‌రి ఇందులో ఎంత నిజం ఉంద‌నేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగ‌క త‌ప్ప‌దు మ‌రి. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాలో కృతి స‌న‌న్ క‌థానాయిక‌గా న‌టించిన విష‌యం తెలిసిందే.

prabhas marriage with kriti sanon
prabhas marriage with kriti sanon

Prabhas : పెళ్లి భాజా…

అయోధ్య వేదిక‌గా టీజర్ విడుదల చేయ‌గా, ఆ వేదికపై అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. వేదికపై ప్రభాస్ ఉక్కపోతకు ఇబ్బంది పడడం కనిపించింది. స్టేజ్ పై ఏర్పాటు చేసిన అధిక కెపాసిటీ లైట్ల వేడికి ప్రభాస్ నుదుట చెమటలు ప‌డుతుంటే, అతడు చేత్తో తొలగించుకోవడం కెమెరాల్లో రికార్డ్ అయింది. పక్కనే ఉన్న కృతి సనన్ దీన్ని గమనించి తన దుపట్టా అంచును తీసి ప్రభాస్ కు ఇవ్వబోవ‌డం, అప్పుడు ప్ర‌భాస్ వ‌ద్ద‌ని తన చేత్తోనే చెమటను తుడుచుకోవడం కనిపించింది. ఈ స‌న్నివేశాన్ని చూసి ఇద్ద‌రి మ‌ధ్య సంథింగ్ సంథింగ్ న‌డుస్తుంద‌ని పుకార్లు కూడా పుట్టించారు. మొన్న‌టి వ‌ర‌కు అనుష్క‌తో, ఇప్పుడు కృతితో ఎఫైర్స్ అంట‌క‌డుతుండ‌గా, వీటికి ప్ర‌భాస్ ఎప్పుడు   ఫుల్ స్టాప్ పెడ‌తాడో చూడాలి.