Prabhas : ఆదిపురుష్ కోసం లక్షలాది ప్రభాస్ ఫ్యాన్స్ పాదయాత్ర… – హాలీవుడ్ వరకూ వైరల్ అవుతోన్న న్యూస్.!

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు.. డార్లింగ్ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా అదే రేంజ్ లో క్రేజ్ ఉంటుంది.. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం ఆదిపురుష్.. ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలవుగా విపరీతమైన నెగిటివిటీని సొంతం చేస్తుంది.. అది చాలదన్నట్టు ఈ సినిమా టీజర్ యూట్యూబ్ నుంచి తొలగించాలని, అలాగే సినిమా విడుదల కాకుండా స్టే ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టుకు పిటిషన్ వేయగా.. ఢిల్లీ హైకోర్టు చిత్ర యూనిట్, ప్రభాస్ కు నోటీసులకు పంపించిన సంగతి తెలిసిందే.. అయితే ఈ విషయం నుంచి ప్రభాస్ బయటపడాలని ప్రభాస్ అభిమానులు ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు..!!

రామాయణ ఇతిహాస కథ ఆధారంగా ఆదిపురూష్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. అయితే నీ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడు పాత్రలో నటిస్తున్నారు.. ఈ సినిమా విషయంలో ఆ శ్రీరాముడు ప్రభాస్కి అండగా ఉండాలని ఈ సినిమా విడుదల అవ్వాలని ఈ సినిమాకు వచ్చిన కష్టాలన్నీ ఘట్టకాలని ప్రభాస్ అభిమానులు కాలినడకన భద్రాచలం, అయోధ్య వెళ్తున్నట్లు ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. అయితే ఈ పాదయాత్రలో ప్రభాస్ ఫ్యాన్స్ వందల్లో, వేలల్లో కాదు లక్షల్లో పాల్గొంటున్నట్లు సమాచారం.. ప్రభాస్ ఫ్యాన్స్ కి ఆయన అంటే అమితమైన ఇష్టం.. ప్రభాస్ కూడా అభిమానులు అంటే ఎంత ఇష్టమో స్వయంగా తానే పలు సినిమా ఈవెంట్స్ లో చెప్పారు..

Prabhas fans padayatra on Adipurush movie
Prabhas fans padayatra on Adipurush movie

ప్రభాస్ కి ప్రస్తుతం కష్టకాలం నడుస్తుందేమోనని ప్రభాస్ అభిమానులు ఆందోళపడుతున్నారు.. పైగా ఈ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి ఏదో విధంగా అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి.. ఆ అడ్డంకులన్నీ ఆ శ్రీరాముడే గట్టెక్కించాలని ప్రభాస్ ఫ్యాన్స్ భద్రాచలం, అయోధ్యకు పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారట.. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ న్యూస్ కేవలం టాలీవుడ్ లోనే కాదు హాలీవుడ్, బాలీవుడ్ లో సైతం వైరల్ అవుతుంది.. ఈ సినిమా సంక్రాంతి పర్వదినం సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది..