Zodiac Signs : త్రయోదశి శనివారం రోజున వచ్చింది కాబట్టి.. ఈ రోజును శనిత్రయోదశి అని పిలుస్తారు. ఇక ముఖ్యంగా శని దేవుడికి ఇష్టమైన ఈ రోజున కొన్ని రాశుల వారు ప్రత్యేకంగా శనీశ్వర పూజ చేయడం వల్ల వారి జీవితంలో ఉన్న ఆర్థిక కష్టాలు తొలగిపోయి, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అని చెబుతున్నారు. శనీశ్వరుడిని న్యాయ దేవుడు గా భావిస్తారు. వ్యక్తుల యొక్క కర్మ ఫలితాలను బట్టి ఫలాలు ఇస్తాడు అని శని దేవుని యొక్క అనుగ్రహం వుంటే ఆ వ్యక్తుల జీవితం మారిపోతుంది అని.. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా , సుఖసంతోషాలతో జీవిస్తారని ప్రతిదీ. శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి శని త్రయోదశి కి మించిన రోజు మరొకటి లేదు.
ప్రస్తుతం కుంభ , మీన, మకర రాశి వారికి ఏలినాటి శని నడుస్తోంది . ఇక వీరికి ఏలినాటి శని వల్ల కష్టాలు తప్పవు . కర్కాటక, వృశ్చిక రాశి పై చెడు ప్రభావం చూపనుంది. శనీశ్వరుని పూజిస్తే శని దోషం కొంతవరకు తగ్గుతుంది. సూర్యాస్తమయం తర్వాత రావి చెట్టు వద్దకు వెళ్ళి దీపం వెలిగించడం వల్ల శనీశ్వరుడు సంతోషిస్తాడు. ఇలా చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు. అంతేకాదు శనీశ్వరుడు మన కర్మానుసారంగా ఫలితాలను అందిస్తాడు. కాబట్టి మంచి మార్గంలో నడిచేవారికి ఎల్లవేళలా ఆయన తోడు ఉంటాడు అని ప్రతిదీ.
ముఖ్యంగా శనివారం రోజు హనుమంతుడిని ఆరాధించడం వల్ల శని దేవుడు శాంతిస్తాడు. ఇక పురాణాల ప్రకారం బజరంగబలి భక్తులను తాను ఎప్పుడూ వేధించనని శనీశ్వరుడు హనుమంతుడికి వాగ్దానం కూడా చేశాడు. అందుకే శని దోషాలు తొలగిపోవాలంటే హనుమాన్ పూజ చేయాల్సిందే. శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవాలి అంటే శనివారం రోజు రావి చెట్టు వద్దకు వెళ్లి , చెట్టుకు నీళ్లు పోసి, చెట్టు చుట్టూ ఏడు సార్లు ప్రదక్షిణ చేసి అవసరమైన వారికి నూనె దానం చేయాలి ఇలా చేస్తే శని దోషం తొలగిపోతుంది.