Mahesh Babu : మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ నటించిన మల్టీ స్టారర్ చిత్రం ఆచార్య.. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 29 న ఈ సినిమా దియేటర్స్ లో విడుదల కానుంది.. శనివారం రోజున ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ స్పీచ్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఈ ఈవెంట్ లో ఏ ఒక్కరూ కాజల్, మహేష్, సోను సూద్ ప్రస్తావన తీసుకురావడం చర్చకు దారితీసింది..!
ఆచార్య సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ నటిస్తోంది. కాజల్ ఆచార్య టీజర్, ట్రైలర్ లో కూడా ఎక్కడా కనిపించలేదు. ఇది ఆమెకు చిత్రయూనిట్ ఇచ్చిన విలువ. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆమె గురించి ఏ ఒక్కరూ సినిమాకు పని చేసిందని కూడా మాట్లాడలేదు. దాంతో కాజల్ ఈ సినిమాలో ఉంటుందా లేదా అనే అనుమానాలు కూడా కొందరిలో కలుగుతున్నాయి. కాజల్ ను మొదటి నుంచి కూడా ఇలానే పక్కన పెట్టేస్తున్నారు. మరి సినిమా చూస్తే గాని కాజల్ పాత్రకు ఉన్న ప్రాముఖ్యత ఏంటో తెలీదు.
ఆచార్య సినిమాలో సోనూసూద్ విలన్. ప్రతినాయకుడు ఎంత బలంగా ఉంటే హీరో పాత్ర అంత ఎలివేట్ అవుతుంది అని అంటారు. అలాంటి పాత్రలో నటించిన సోనూసూద్ పేరు మాత్రం ఈవెంట్లో ఎవ్వరు ప్రస్తావించలేదు. మరీ ముఖ్యంగా ఈ సినిమాకు మహేష్ బాబు తన వాయిస్ ఓవర్ ఇచ్చారు తన గాత్రంతో నే ఈ చిత్రం ప్రారంభమవుతుంది ఈ విషయాన్ని కూడా స్టేజి మీద ఏ ఒక్కరూ ప్రస్తావించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.