Anasuya: టీవీ యాంకర్గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత జబర్ధస్త్ షో ఫుల్ క్రేజ్ పొందిన అందాల ముద్దుగుమ్మ అనసూయ. ముందుగా జబర్దస్త్ షోను కేవలం గ్లామర్తోనే రక్తి కట్టించగా, ఆ తర్వాత నెమ్మదినెమ్మదిగా సినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ముందుకు సాగింది. ఇప్పుడు అనసూయ బుల్లితెర కన్నా వెండితెరపైనే ఎక్కువ దర్శనమిస్తుంది. అందాల య కెరీర్ ఆరంభం నుంచి ఆమె చేసిన సినిమాలు తక్కువే అయినా.. గుర్తింపు మాత్రం భారీగానే సంపాదించింది ముఖ్యంగా ‘క్షణం’, ‘రంగస్థలం’లో ఆమె చేసిన పాత్రలకు మంచి మార్కులే పడ్డాయనే చెప్పాలి.
అంత డిమాండ్ చేస్తే ఎలా..
తనకు ఎంతో ఫేమ్ తీసుకొచ్చిన జబర్ధస్త్ నుండి తప్పుకున్న అనసూయ ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్లు చేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘కన్యాశుల్కం’ అనే వెబ్ సిరీస్లో నటించనున్నారని తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ గురజాడ అప్పారావు క్లాసిక్ నాటకం ‘కన్యాశుల్కం’ ఆధారం రూపొందనుందని, ఇందులో మధురవాణి అనే వేశ్య క్యారెక్టర్లో అనసూయ కనిపించనుందని తాజా టాక్. ఇక్కడ విశేషం ఏమంటే.. ఈ సిరీస్ మొత్తం అనసూయ క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుందట. మొత్తానికి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటుంది అనసూయ.
అనసూయ రెమ్యునరేషన్ గురించి తాజాగా పలు వార్తలు వస్తున్నాయి. ఒక్కో షోకు దాదాపుగా రూ. 2 లక్షల రెమ్యునరేషన్ వరకు ఈ అమ్మడు తీసుకుంటున్నట్లు సమాచారం.. సుమ కూడా ఈ రేంజ్లో తీసుకోదని, అనసూయ అమాంతం ఇంతలా పెంచేయడమేంటని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రెమ్యునరేషన్ ఎక్కువ డిమాండ్ చేస్తున్న క్రమంలోనే అనసూయకి టీవీ షోస్ ఆఫర్స్ పెద్దగా రావడం లేదనే టాక్ కూడా వినిపిస్తుంది. అనసూయ నటించిన రంగమార్తాండ చిత్రాలతో పాటు పలు చిత్రాలు విడుదలకి సిద్ధంగా ఉన్నాయి.