Pooja Hegde : టాలీవుడ్లో సత్తా చాటి బాలీవుడ్లో అదృష్టం పరీక్షించుకుంటున్న అందాల భామలలో పూజా హెగ్డే కూడా ఒకరు. చూపు తిప్పుకోకుండా చేయగల అందం, మెస్మరైజ్ చేసే నటన, అప్పుడప్పుడూ గ్లామర్ షో చేస్తూ ప్రేక్షకులను ఫిదా చేస్తోన్న ఈ అందాల ముద్దుగుమ్మ.. వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. తెలుగులోనే కాదు.. వేరే భాషల్లోనూ సినిమాలు చేస్తూ కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా మార్చుకుంటుంది. టాలీవుడ్లో సక్సెస్ కాలేకపోయినా పూజా హెగ్డేకు మాత్రం ఆఫర్లు పలకరిస్తూనే ఉండడం విశేషం.
ఎరుపెక్కిన అందం..
‘అరవింద సమేత.. వీరరాఘవ’తో మొదటి భారీ హిట్ అందుకున్ పూజా.. అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. ‘మహర్షి’, ‘గద్దలకొండ గణేష్’, ‘అల.. వైకుంఠపురములో’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ వంటి హిట్లను అందుకుని టాలీవుడ్లో సత్తా చాటింది. అయితే ఇటీవలి కాలంలో ఈ అమ్మడిని తెగ ఫ్లాపులు పలకరిస్తున్నాయి. ఈ ఏడాది ఆమె నటించిన ‘రాధే శ్యామ్’, ‘ఆచార్య’ మూవీలు బిగ్ డిజాస్టర్లు కాగా, వాటికి తోడు తమిళంలో నటించిన ‘బీస్ట్’ మూవీ కూడా ఆశించిన రీతిలో ఆడకపోవడంతో పూజా ఫ్యాన్స్ చాలా నిరుత్సాహంగా ఉన్నారు.
ఇక పూజా హెగ్డే ప్రస్తుతం బాలీవుడ్ సినిమా సర్కస్తో బిజీగా ఉంది. కామెడీ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న విడుదల కానుండగా, చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరు పెంచారు. దీంతో టీమ్ అంతా ఇంటర్వ్యూలతో సందడి చేస్తూ రచ్చ చేస్తుంది. రీసెంట్గా పూజా, జాక్వెలిన్, రణ్వీర్తో పాటు చిత్ర బృందం అంతా రెడ్ డ్రెస్లో కనిపించి కనువిందు చేశారు. ముఖ్యంగా పూజా హెగ్డే తన నడుము కొలతలు చూపిస్తూ పిచ్చెక్కించింది. గుంటూరు మిర్చిని మించిన ఘాటు అందాలతో పూజా రచ్చ చేసింది. ఈ బ్యూటీని చూసి ప్రతి ఒక్కరు మైకంలో మునిగి తేలుతున్నారు.
View this post on Instagram