Guppedanta Manasu 24 Oct Episode :వసుధర డాడ్ వాళ్ళు వస్తారంటావా.. డాడ్ దీంట్లో నుంచి వెళ్లిపోవడానికి ఒక రకంగా నేను కూడా కారణం.. ఈమధ్య పెద్దమ్మ విషయంలో ఒకటి రెండు సార్లు డాడ్ అరిచాను.. డాడ్ చేత పెద్దమ్మ కి సారీ చెప్పించాను.. ఎప్పటికైనా మీ పెద్దమ్మ అసలు సంగతి మీకు తెలిసేలా చేస్తాను అని అంటుంది వసుధార.. ఒకవేళ నా మాటలు డాడ్ హృదయాన్ని గాయపరిచి ఉండవచ్చు అని రిషి వసుధారతో అంటాడు.. అందుకే కచ్చితంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోరు.. ఒకవేళ జగతి మేడం ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అని అన్నారేమో అని వసుధార మనసులో అనుకుంటుంది..
జగతి మేడం మీరు ఇద్దరు చాలా క్లోజ్ కదా వసుధార.. మేడం నీకు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలీదా అని వసుధార ను అడుగుతాడు.. నిజంగా తెలియదా అని రిషి అడుగుతాడు.. అదేంటి సార్ మీరు అలా మాట్లాడుతున్నారు.. నన్ను కూడా అనుమానిస్తున్నారా అని వసుధర అడుగుతుంది.. ఒక్కసారి నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడండి సార్.. అప్పటికి నేను మీకు అబద్ధం చెబుతున్నానని అనిపిస్తే నేను ఏమి చేయలేను అని వసుధార అంటుంది.. అదికాదు వసుధార మన ఇద్దరి మధ్య దాపరికాలు ఉండకూడదు.. అందుకే అడిగాను అని రిషి అంటాడు.. నేను మీ నీడని సార్.. మన ఇద్దరం కలిసి జీవితం లో ప్రయాణించాలని అనుకుంటున్నాము.. అని వసుధార అంటున్న మాటలను చాటుగా దేవయాని వింటుంది..
నన్ను అనుమానించడం ఏంటి సార్ అని అంటుంది వసుధార.. డాడ్ నన్ను వదిలి పెట్టి వెళ్లిపోయారన్న బాధ నన్ను ఇలా బాధ పెడుతుంది అని రిషి అంటాడు.. నువ్వు కూడా ఇలా ఎప్పుడో ఒకప్పుడు కోపం వచ్చి దూరంగా నన్ను వదిలి పెట్టి వెళ్లి పోవు కదా అని రిషి వసుధార ను అడుగుతాడు.. చెప్పాను కదా సార్ నేను మీ నీడనని.. మీ నీడ మిమ్మల్ని వదిలి పెట్టదు.. వసుధార జాగతి మేడం నీ కన్న చెబితే బాగుండేది కదా అని రిషి అంటాడు..
వసుధార రిషి కోసం వంటగదిలో కాఫీ రెడీ చేసి ధరణికి ఒక కప్పు ఇచ్చి.. తను రిషి కోసం కాఫీ తీసుకొని వెళుతుండగా.. దేవయాని అక్కడికి వస్తుంది.. ధరణి పిలవని పేరంటానికి వచ్చిన వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారో అని అంటుంటే.. రిషి సార్ నన్ను వెళ్ళమనేదాకా నేను వెళ్ళను అని వసుధార చెబుతుంది.. మహీంద్రా సార్ , జగతి మేడం ఎలా ఇంటికి తీసుకురావాలో అని ఆలోచిస్తే ఉపయోగం ఉంటుంది అని దేవయానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది వసుధార..
గౌతమ్ మహింద్రా, జగతి ఎక్కడ ఉన్నారో వెతికి పట్టుకుంటాడు.. వాళ్ళని ఇంటికి రమ్మని చెబుతాడు.. ఒక సమస్య వచ్చింది అని సాల్వ్ అవ్వాలి అని అంటాడు మహీంద్రా.. కానీ మేము ఇక్కడ ఉన్నామని నువ్వు ఎవ్వరికీ చెప్పద్దు అని అంటాడు.. వాళ్ళు ఇద్దరు కలిసి ఉండాలి అప్పుడే మళ్ళీ నేను ఆ ఇంటికి వస్తాను అని మహీంద్రా మనసులో అనుకుంటాడు.. వసుధర రిషిను తప్పు చేశారేమో అని అంటుంది.. వసుధర నేను నీతో ఇప్పుడు వాదించలేను అని అంటాడు..