Allu Arjun-Mahesh Babu :కాంతార సినిమా ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది.. ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు..కన్నడ హీరో రిషబ్ శెట్టి తానే హీరోగా తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కాంతార.. కన్నడలో దుమ్ము దులిపిన ఈ చిత్రం నిన్న తెలుగులో కూడా విడుదల చేశారు.. కాంతార సినిమా తో రిషబ్ శెట్టి పెద్ద బ్రేక్ వచ్చింది.. శాండిల్ వుడ్ కి ఈ సినిమా మైలురాయి అని చెప్పుకోవడంలో తప్పులేదు..! అయితే ఈ సినిమా డైరెక్టర్ కి మహేష్ బాబు కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతుంది..!
కేజిఎఫ్ మేకర్స్ హంబోలే బ్యానర్ పై రిషబ్ శెట్టి మనోజ్ఞ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార సినిమాను తెలుగులో నిర్మాత అల్లు అరవింద్ సమర్పించారు.. కన్నడలో ఈ సినిమాకు ఉన్న క్రేజ్ కి తెలుగులో క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో.. అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ అనువాద రూపంలో రిలీజ్ చేశారు.. ఇక్కడ కూడా ఈ సినిమా సాలిడ్ టాక్ ను సొంతం చేసుకుంది.. అయితే ఈ సినిమా హీరో కం డైరెక్టర్ రిషబ్ శెట్టికి మహేష్ బాబుకి ఉన్న లింక్ ఏంటి అంటే.. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తన నెక్స్ట్ సినిమాను రిషబ్ శెట్టి దర్శకత్వంలో చేయనున్నట్లు సమాచారం.. ఇప్పటికే మహేష్ బాబు హోంబోలే బ్యానర్ తో సైన్ చేసినట్టు తెలుస్తోంది.. రిషబ్ శెట్టి కూడా మహేష్ బాబుతో సినిమా తీయడానికి ఒప్పుకోవడంతో ఈ సినిమా షూటింగ్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం..
రాజమౌళి కూడా ముందుగా ఈ సినిమా తీసిన తర్వాతే తన సినిమాను ప్లాన్ చేయాలని అనుకుంటున్నాడట.. ఈ సినిమాతో మహేష్ బాబు పాన్ ఇండియా కు పరిచయం అవుతాడు కాబట్టి.. తను తీయబోయే పాన్ వరల్డ్ సినిమా కి ఇది ప్లస్ అవుతుందనీ రాజమౌళి కూడా ఒప్పుకున్నాడట.. ఎలాగూ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కి బ్రేక్ పడింది.. ఈ లోపు ఈ సినిమా తీయాలని మహేష్ బాబు సైన్ చేసినట్టు తెలుస్తోంది.. అదే నిజయితే మాత్రం అల్లు అర్జున్ తీయబోయే పుష్ప 2కి మించిన ఊర మాస్ సినిమా అవుతుందని అనడంలో సందేహమే లేదు..