Flipkart Big Billion Sale : ఫ్లిప్ కార్ట్ గత మూడు వారాల నుంచి కష్టమర్లను ఆఫర్ల పేరిట విపరీతంగా ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎన్నో ఉత్పత్తులపై భారీ ఆఫర్లు ప్రకటించి మరింత లాభం పొందుతోంది. ఇక ఈ క్రమంలోనే మీరు కూడా ఒక టీవీ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే అత్యంత కారు చౌక ధరకే లభిస్తూ ఉండడం గమనార్హం. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో బిగ్ దివాలి సేల్ జరుగుతున్న నేపథ్యంలో స్మార్ట్ టీవీల పై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ముఖ్యంగా బ్రాండెడ్ స్మార్ట్ టీవీల పై భారీ తగ్గింపు ధరలు ఉండడం గమనార్హం. ఇక ఈ ఆఫర్లో భాగంగా రూ.25 వేల ఖరీదైన ఎంఐ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ ని కేవలం రూ.2వేలకే సొంతం చేసుకోవచ్చు.
MI 5A ఇంచెస్ స్మార్ట్ టీవీ అసలు ధర రూ.24,999.. ఫ్లిప్ కార్ట్ సేల్ లో భాగంగా 48% డిస్కౌంట్ తర్వాత రూ.12,999 కే సొంతం చేసుకోవచ్చు. అంతే కాదు ఇందులో ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.11,000 అదనంగా తగ్గించబడుతుంది. మీరు ఎక్స్చేంజ్ చేసుకునే టీవీ కండిషన్, పర్ఫామెన్స్ అన్ని బాగుంటేనే ఈ పూర్తి ఆఫర్ వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి. ఇక అలా పూర్తిగా అన్ని ఆఫర్లు వర్తిస్తే రూ.25 వేల స్మార్ట్ టీవీ ని కేవలం రూ.2 వేలకే సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎస్బిఐ, కోటక్ క్రెడిట్ కార్డుల పై కొనుగోలు చేస్తే క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా ఉన్నాయి.
ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా పనిచేస్తుంది. గూగుల్ అసిస్టెంట్ క్రోమ్ బీస్ట్ ఇన్బిల్ట్ గా ఉంటుంది.1366 x 768 పిక్సెల్ రిజల్యూషన్ తో..20W సౌండ్ అవుట్ పుట్ ను కూడా అందిస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ వంటి ఓటిటిలు, యూట్యూబ్ సపోర్ట్ కూడా చేస్తుంది.