Nayanthara : నయనతార ‘ అద్దె గర్భం ‘ సర్రోగశీ అంటే ఏంటి .. ఎంత ఖర్చు అయ్యింది ?

Nayanthara : సోషల్ మీడియాలో ఇప్పుడు నయనతార, విఘ్నేష్ శివన్ కవల పిల్లల గురించి చర్చ బాగా జరుగుతుంది. సరోగసి పద్దతిలో వీళ్లు పేరెంట్స్ కావడంతో.. అభిమానులు శుభాకాంక్షలు చెప్తున్నారు. నయన్ సన్నిహితులు కూడా ఈ కొత్త అనుభవాన్ని ఎంజాయ్ చేయండి అంటున్నారు. ఈ సరోగసితో మరోసారి అసలు ఈ పద్దతి ఏంటి.. అసలు ఎందుకు సరోగసి వైపు వెళ్తారు అనేది మరోసారి చర్చనీయాంశంగా మారిపోయింది. సరోగసి అంటే అద్దె గర్భం అని అర్థం. భార్యాభర్తలు ఇద్దరూ తమకు వీలు కాని నేపథ్యంలో.. తమ బిడ్డను మరొకరి ద్వారా పొందే ప్రక్రియనే సరోగసి అంటారు. భార్య నుంచి అండం.. భర్త నుంచి వీర్యం తీసుకుని మరొకరి గర్భంలోకి దాన్ని ఇంజెస్ట్ చేస్తారు. ఇప్పుడు నయనతార విషయంలోనూ ఇదే జరిగింది. జూన్ 9న నయన్, విఘ్నేష్ పెళ్ళి జరిగింది.

ఐదేళ్ళ ప్రేమకు ఈ మద్యే పెళ్లితో శుభం కార్డ్ వేసారు ఈ జంట. పెళ్లి తర్వాత కొన్ని రోజుల పాటు సినిమాలతోనే బిజీగా ఉన్న ఈ జోడీ.. ఆ తర్వాత రెండు నెలల వరకు హనీమూన్ ఎంజాయ్ చేసారు. కొన్ని రోజులుగా పిల్లల గురించి కంటిన్యూస్‌గా మాట్లాడుతూనే ఉన్నారు నయన్, విఘ్నేష్ జోడీ. అయితే వీళ్ళిద్దరూ ఇలా సరోగసి పద్దతిలో అమ్మా నాన్న అవుతున్న విషయం మాత్రం దాచేసారు. ఉన్నట్లుండి సడన్‌గా ఇలా న్యూస్ బయటికి రావడంతో ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. అయితే నయన్ సరోగసి పద్దతికి ఎంత ఖర్చు చేసింది అనే విషయంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం దీనికోసం భారీగానే ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. తమకు తెలిసిన వాళ్ల నుంచే ఈ అద్దె గర్భం పంచుకున్నారని.. వాళ్లకు దాదాపు కోటి వరకు డబ్బులు ఇచ్చారని ప్రచారం జరుగుతుంది.

Nayanthara sarogasi news viral
Nayanthara sarogasi news viral

Nayanthara : అమ్మా నాన్నలు అయ్యారిలా..

ఇదిలా ఉంటే నయన్, విఘ్నేష్ సరోగసి పద్దతిపై వివాదం రేగింది. ఈ అంశంపై త‌మిళ‌నాడు ఆరోగ్య శాఖ మంత్రి ఎం సుబ్ర‌హ్మ‌ణ్యం స్పందించారు. స‌రోగ‌సి వివ‌రాలు వెంటనే ప్ర‌భుత్వానికి ఇవ్వాల‌ని ఆదేశాలు జారీ చేశారు. 4 నెలల క్రితం పెళ్లయిన జంట అప్పుడే సరోగసీ ద్వారా గర్భం దాల్చగలరా.. లేదంటే దానికి ఏదైనా కాల ప‌రిమితి ఉందా అని మీడియా స‌మావేశంలో మంత్రి సుబ్ర‌హ్మ‌ణ్యంను ఓ రిపోర్టర్ ప్రశ్నించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. ఈ స‌రోగ‌సి అంశంపై తమ శాఖ వివరణ కోరుతుందని.. అన్ని వివరాలు త్వరలోనే చెప్తామని తెలియజేసారు. అంతేకాదు.. స‌రోగ‌సీ చ‌ట్ట‌బ‌ద్దంగా జ‌రిగిందా లేదా అనే విషయంపై కూడా ఆరా తీస్తున్నట్లు తెలిపారు ఈయన. దానిపై డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ విచారణకు ఆదేశిస్తామన్నారు. ఏదేమైనా నయన్ అద్దె గర్భం వ్యవహారం ఇప్పుడు జోరుగానే ట్రెండ్ అవుతుంది.