మనిషి జీవితంలో డబ్బుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఎంతలా అంటే ఇంట్లో ఉన్నా సరే .. లేదా బయటికి వెళ్ళినా సరే డబ్బు అవసరం చాలా ఉంటుంది. ముఖ్యంగా తాగి నీటిని మొదలుకొని చనిపోయిన తర్వాత కాలే కట్టే వరకు ప్రతి దానికి డబ్బు అవసరం అవుతుంది. అయితే డబ్బు మన జీవితంలో ఒక భాగం కావాలే తప్పా.. డబ్బే జీవితం కాకూడదు. ఈ మధ్యకాలంలో డబ్బు ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉంటుందో వారికే సమాజంలో గౌరవం లభిస్తోంది. డబ్బు లేని వాడిని చాలా అధ్వానంగా జంతువుల తో సమానంగా చూస్తున్నారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక ఇలాంటి బాధలు పడకుండా చాలామంది డబ్బు సంపాదించడానికి ఎంత కష్టపడుతున్నా.. సంపాదించిన ఆ డబ్బు నిలవదు.ఇక చేసిన పనికి ఫలితం సకాలంలో అందక అప్పుల బాధలు పెరుగుతాయి. వీటన్నింటికి కారణం శుక్రగ్రహం యొక్క అనుగ్రహం లేకపోవడమే.ఆ లక్ష్మిదేవీ కి ఇష్టమైన రోజు శుక్రవారం. ఆ శుక్రవారం రోజు ఇలా ముడుపు కడితే చాలు..
మన కష్టమునకు ఫలితం సకాలంలో అందుతుంది. అది ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.మన పెద్దవాళ్ళు చెప్పినట్టు ఇంటి ని చూసి ఇళ్ళాలిని చూడాలి అంటారు. కారణం ఆ ఇల్లు ఎంత శుభ్రంగా, ప్రశాంతంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసమై ఉంటుంది. ఇంటి సభ్యులు కూడా ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందే లేచి, పాచి పనులు తొందరగా ముగించుకోని, దీపారాధన చేసిన ఇల్లు స్వర్గం తో సమానం. ఇల్లాలు ప్రతి శుక్రవారం ఇలా చేస్తే ఇంటి యందు ఉన్న బాధలు తొలగి సర్వ సంపదలు చేకూరుతాయి.ప్రతి శుక్రవారం సూర్యోదయం కంటే ముందు లేచి, తలస్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసే నీటి లో ఉప్పుకానీ, పసుపు కాని,లేదా రెండు కర్పూరం బిళ్ళలు కానీ వేసి శుభ్రం చేస్తే ఇంటిలో వున్న నెగటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. ఇంటి ముందు శుభ్రం చేసి ముగ్గులు పెట్టి, గుమ్మానికి పసుపు రాయాలి. పూజ గదిలో లక్ష్మీదేవి తామరంలో కూర్చున్న ఫోటో తీసుకొని దాని ముందు కుబేర ముగ్గును వరిపిండితో వేసి అందులో పసుపు కుంకుమలు వేయాలి.
ఏదైనా ఒక ఎర్రటి బట్ట తీసుకొని రూపాయి నాణాలు 27 వేసి ముడుపు కట్టాలి. లక్ష్మీదేవి పటము ముందు నువ్వల నూనె తో కానీ, కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేసి,లక్ష్మీదేవికి ఇష్టమైన ఎర్రటి పూలతో పూజించాలి.ఇలా ఆరు శుక్రవారాలు క్రమం తప్పకుండా చేసి ఏడో శుక్రవారం రోజూ..ఎక్కడైనా మీకు దగ్గర లో వున్న లక్ష్మీదేవి ఆలయానికి వెళ్లి..అక్కడ వున్న బ్రాహ్మణులకు మీరు కట్టిన ముడుపు వారికి దానంగా ఇచ్చి.. వారి పాదాలకు నమస్కరిస్తే మన పాపాలు తొలగి, ఆ లక్ష్మిదేవీ కటాక్షంతో శుక్రగ్రహ అనుగ్రహం కలిగి మన కు రావాల్సిన డబ్బులు సకాలంలో మన చేతికి అంది అప్పుల బాధలు తొందరగా తీరిపోతాయి. ముఖ్యంగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన వారు తప్పకుండా ఇలాంటి నియమాలు పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పటికీ వారిపైనే ఉంటుంది.
ఇక లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే తప్పకుండా మన ఇల్లు శుభ్రంగా వాస్తు ప్రకారం ఉండాలి. ఇక రాత్రిపూట తిన్న కంచాల ను శుభ్రం చేయడం వంట గదిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచడం ఇంట్లో ఆడవారిని సంతోషంగా చూసుకోవడం ఇలాంటి పనులు వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఇంట్లో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి.ఇక అంతే కాదు లక్ష్మీదేవి అనుగ్రహం మరింత కలగాలి అంటే మీ ఇంట్లో మనీ ప్లాంట్ పెట్టి..అందులో నీళ్ళు, పాలు కలిపి మనీ ప్లాంట్ కి పోయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందట. బ్రాహ్మణులకు, పేదవారికి, మూగజీవాలకు దానం గా ఆహార పదార్థాలను ఇవ్వడం వల్ల వారి ఆశీస్సులు మీపై ఉండి మీ సంపదకు ఎటువంటి నష్టం వాటిల్లదు. అంతే కాదు కొత్తగా రావాల్సిన డబ్బుకు మార్గాలు కూడా ఏర్పడతాయి.
People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…
Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…
డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…
YS Jagan-Bonda Uma : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…
CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…
In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…
This website uses cookies.