Business Idea : రైతులు భారత దేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు.. కానీ సరైన సమయానికి వర్షాలు లేక పొలాలలో బోరు వేసినా.. నీళ్లు పడక ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాదు పంటల కోసం చేసిన అప్పులు తీర్చలేక.. ఈ అప్పు తీర్చడానికి మరొక అప్పు చేసి ఇలా మూకుమ్మడిగా అప్పులను తీర్చలేక అప్పుల ఊబిలో.. ఆర్థిక సంక్షోభంలో మునిగిపోతున్నారు. అంతేకాదు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఎంతో మంది రైతులు కుటుంబాలను కూడా పోషించుకునే స్థోమత లేక అప్పులు ఇచ్చిన వారి నుంచి అవమానాలు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇక ఇలాంటి దుర్ఘటనలను మనం రోజుకు ఒకటి ఎక్కడో ఒకచోట వింటూనే ఉన్నాం. అలాగే చూస్తూనే ఉన్నాం.. కానీ రైతులు ఇప్పుడు చెప్పబోయే ఒక బిజినెస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా లాభాల బాట పట్టడమే కాకుండా వారికున్న కలలను కూడా నెరవేరుతాయి.ఇక ఈ ఐడియాతో రైతులు నాగలి కి పని పట్టే సమయం ఆసన్నమైంది అని చెప్పవచ్చు. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో కాలం మారుతున్న కొద్దీ ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
అందుకే రైతులు మళ్లీ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక అలాంటి వాటిలో వెనీల పంట కూడా ఒకటి. ప్రస్తుతం మన దేశంలో కొన్ని ప్రాంతాలలో అత్యధికంగా రైతులు ఈ పంటలు పండిస్తున్నారు. ఇక భారత దేశంలో అత్యంత ఖరీదైన పంట కుంకుమపువ్వు.. ఆ తర్వాత ఖరీదైన పంటగా వెనీల గుర్తింపు తెచ్చుకుంది. పపువా న్యూ గినియా.. మడగాస్కర్.. ఇండియా.. యుగాండా వంటి దేశాలలో ఎక్కువగా ఈ పంటను రైతులు సాగుచేస్తున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా తయారు చేసే ఐస్ క్రీమ్ లో వెనిల్లా ఫ్లేవర్ వాడకం 40 శాతం వరకు ఉంది.ఈ వెనీల పంట ద్వారా వచ్చే పండు సువాసన చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే వీటిని కేకులు, ఐస్ క్రీములు తో పాటు ఇతర సౌందర్య ఉత్పత్తుల తయారీలో కూడా ఉపయోగిస్తున్నారు.. వెనీలాలో వెనిలిన్ అనే ఒక రసాయన మూలకం ఉండడంవల్ల ఎక్కువగా ఐస్ క్రీం ఉత్పత్తులలో ఉపయోగిస్తారు ముఖ్యంగా వీటి పండ్లు విత్తనాలు కూడా క్యాన్సర్ వంటి వ్యాధులకు చాలా ప్రభావంతంగా పనిచేస్తాయి అని వైద్యులు సైతం తెలుపుతున్నారు.
ముఖ్యంగా బరువు తగ్గాలని భావించేవారు వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల తప్పకుండా బరువు తగ్గుతారు. ముఖ్యంగా పొట్టను శుభ్రం చేయడంతో పాటు వ్యాధినిరోధక శక్తి కూడా పెంపొందుతుంది. దగ్గు , జలుబు, జ్వరం, ప్లూ వంటి సమస్యల బారి నుండి ఈ వెనీల కాపాడుతుంది.ఇక ఇలా ఆరోగ్యానికి, అందానికి, రుచికి ఎన్నో రకాలుగా ఉపయోగపడే వీటి కాయలకు మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది. ఇక ఈ పంట సాగుకు బ్రౌన్ కలర్ నేలలు చాలా చక్కగా అనువుగా ఉంటాయి. ఇక నేల పి హెచ్ విలువ 6.5 నుంచి 7.5 వరకు ఉంటే కచ్చితంగా ఆ భూమిలో ఈ మొక్కలను బాగా పెంచవచ్చు. ముఖ్యంగా వీటి పండ్లు చాలా పొడవుగా ఉంటాయి.. పుష్పించి.. కాయలు రావడానికి సుమారుగా పది నెలల సమయం పడుతుంది. వీటి కాయలను మొక్కల నుంచి వేరుచేసి విత్తనాలను కూడా వేరు చేస్తారు.
వీటిని అనేక ఆహార పదార్థాల తయారీలో కూడా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా భారతదేశంలో వెనీలా విత్తనాలు కిలో ధర రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు ధర పలుకుతున్నాయి. ఒక్కసారి ఈ పంట వేశారు అంటే కచ్చితంగా మిలియనీర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పంట వేసేటప్పుడు ఒక్కసారి మీరు మీ భూసారాన్ని పరీక్షించి ఆ తర్వాత వ్యవసాయ నిపుణుల సలహా తీసుకొని పంట వేయడం ప్రారంభించాలి. ఇక అన్ని మెలకువలతో ప్రారంభిస్తే తప్పకుండా అతి తక్కువ సమయంలోనే మిలియనీర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఇలాంటి పంటల పెంపకానికి కేంద్ర ప్రభుత్వాలు కూడా సబ్సిడీని అందిస్తోంది.ఈ నేపథ్యంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందవచ్చు.
People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…
Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…
డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…
YS Jagan-Bonda Uma : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…
CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…
In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…
This website uses cookies.