Janasena: తిరుగుబాటు ఎంపీ జనసేనలో చేరటం ఖాయమేనా ?

Janasena: వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు చూపు జనసేన వైపు మళ్ళిందా ? ఇదివరకు నుండే ఆయన చూపు జనసేన వైపు మళ్ళిందని సమాచారం. గతంలో నరసాపురం ఎంపీగా రాజీనామా చేసే విషయమై బాగా ఊగారు. వైసీపీ ఎంపీగా రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ జరగబోయే ఉపఎన్నికల్లో ఏ పార్టీ తరపున పోటీచేస్తారు ? ఏ పార్టీ తరపున పోటీచేయాలనే ప్రశ్న తలెత్తింది. అప్పుడే రాజుగారి చూపు జనసేనపైన పడిందంటున్నారు.

నరసాపురం నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ మొదటినుండి కాంగ్రెస్ చాలా బలంగా ఉండేది. అయితే రాష్ట్ర విభజన తర్వాత సీన్ మారిపోయి ఆ పార్టీకి దిక్కులేకుండా పోయింది. కాంగ్రెస్ చాలా బలంగానే ఉన్నా అప్పుడప్పుడు టీడీపీ కూడా గెలుస్తుండేది. ఇదే సమయంలో చాలా రేర్ గా బీజేపీ అభ్యర్ధులు కూడా గెలిచారు. చరిత్రను వదిలేసి వర్తమానాన్ని మాత్రమే తీసుకుంటే ఇక్కడ వైసీపీ చాలా బలంగా ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఇక్కడినుండి రఘురాజు కాకుండా ఇంకెవరైనా అయ్యుంటే మెజారిటి ఇంచా ఎక్కువగా వచ్చేదని పార్టీ వాళ్ళే చెబుతారు.

మొన్నటి ఎన్నికల్లో జనసేన తరపున పోటీచేసిన పవన్ కల్యాణ్ సోదరుడు నాగుబాబుకు సుమారు 2.5 లక్షల ఓట్లొచ్చాయి. అంటే ఈ బెల్టులో రాజకీయధికారం ఎక్కువగా కాపులు, రాజుల మధ్యే మారుతోంది. ఓట్లపరంగా తీసుకుంటే బీసీలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నారు. సో ఏ పార్టీ తరపున పోటీచేస్తే తనకు ఉపయోగమనే విషయంలో రఘురాజు సర్వే చేయించుకున్నారట. జనసేన అయితే బాగుంటుందని లాజికల్ గా కూడా ఎంపీకి అర్ధమైందట.

టీడీపీ తరపున పోటీచేస్తే మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన మద్దతిచ్చే అవకాశాలు లేవు. టీడీపీని బీజేపీ వ్యతిరేకిస్తున్న కారణంగా జనసేన మద్దతు కూడా డౌటే. అందుకనే తాను జనసేనలో చేరితే ఇటు బీజేపీ మద్దతుతో పాటు అటు టీడీపీ మద్దతు కూడా తీసుకోవచ్చన్నది రఘురాజు ప్లాన్. అయితే ఇక్కడ సమస్యేమిటంటే టీడీపీ గనుక పోటీలో దిగకపోతే భవిష్యత్తులో పార్టీకి చాలా ఇబ్బందులు ఎదురవటం ఖాయం. పోటీలోకి అంటు దిగితే కచ్చితంగా గెలుపుకోసం పోరాడాల్సిందే. అంతేకానీ జనసేన తరపున పోటీచేయాలని అనుకుంటున్న రాజుగారి గెలుపుకు టీడీపీ లోపాయికారీగా సహకరిస్తే ఆత్మహత్యా సదృశ్యమే అవుతుంది.

సో ఇవన్నీ ఆలోచించే తిరుగుబాటు ఎంపీ చూపు జనసేనపైన ఉందంటున్నారు. ఈయన కూడా ఈమధ్య మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో పొత్తులు గరిష్టంగా మూడు పార్టీలు, కనిష్టంగా రెండుపార్టీల మధ్య ఉంటుందన్నారు. ఇదే సమయంలో తాను ఏదో పార్టీలో చేరటం మాత్రం ఖాయమని చెప్పారు. అందుకనే రాజుగారు చేరబోయేది జనసేనలోనే అన్న ప్రచారం ఊపందుకుంది. కాకపోతే రాజీనామా, ఉపఎన్నికలు, మళ్ళీ పోటీచేయటం అనే కాన్సెప్టును ఎంపి వదిలేసినట్లున్నారు. అంటే డైరెక్టుగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనే రంగంలోకి దిగుతారేమో చూడాలి.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

2 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

4 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

4 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

5 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

5 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

6 months ago

This website uses cookies.