Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ సీజన్ 6 రసవత్తరంగా సాగుతుంది.. బిగ్ బాస్ హౌస్ లో మిడ్ వీక్ ఎవిక్షన్ పేరుతో ఒకరిని ఎలిమినేట్ చేశారు. ఈ మిడ్ వీక్ ఎవిక్షన్లో భాగంగా శ్రీ సత్యని ఎలిమినేట్ చేసారు. ముందు నుంచి శ్రీసత్య పేరు వినిపిస్తూ వస్తోంది. అందులో భాగంగానే ఆమెని శుక్రవారం ఎపిసోడ్లో హౌజ్ నుంచి బయటకు పంపించేశాడు బిగ్ బాస్. బయటకు వచ్చిన శ్రీసత్య ఊహించని కామెంట్స్ చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
శ్రీ సత్య ఎలిమినేషన్కి ముందు బిగ్ బాస్ హౌజ్ మేట్స్ కి ఓ టాస్క్ ఇచ్చాడు. టైటిల్ విన్నర్ పోటీకి గానూ టాప్ 5లో ఉండేందుకు అర్హత లేని సభ్యులెవరో చెప్పమని అడిగాడు. హౌస్ మేట్స్ అంతా తమ అభిప్రాయాలు చెప్పారు. అందులో రోహిత్ పేరుని శ్రీహాన్ చెప్పగా, ఆదిరెడ్డి పేరుని కీర్తి చెప్పింది. కీర్తి పేరుని శ్రీ సత్య, శ్రీహాన్ పేరుని రోహిత్, కీర్తి పేరుని మళ్లీ రేవంత్, ఆదిరెడ్డి చెప్పారు. అత్యధికంగా మూడు ఓట్లతో కీర్తి బయటకు వెళ్లేందుకు నిలిచింది. హౌస్ మేట్స్ అభిప్రాయం ప్రకారం కీర్తి బయటకు వెళ్లాలి. కానీ ఇక్కడే ట్విస్ట్ పెట్టారు బిగ్ బాస్. ఇది కేవలం ఇంటి సభ్యుల అభిప్రాయం మాత్రమే.. ఆడియెన్స్ నిర్ణయించిందే ఫైనల్ అని తెలిపారు. ఆ రకంగా కొంత సస్పెన్స్ క్రియేట్ చేసి ఆడియెన్స్ ఓటింగ్ ప్రకారం టాప్ 5కి అర్హులు ఎవరు కారో నిర్ణయించారు. అతి తక్కువ ఓట్లు వచ్చిన వారిలో శ్రీసత్య నిలవడంతో ఆమెని గ్రాండ్ ఫైనల్కి రెండు రోజుల ముందు ఎలిమినేట్ చేశారు.. ఎలినిమట్ అయిన శ్రీసత్య కి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండానే ఎలిమినేట్ చేశాడు బిగ్ బాస్..
దాంతో ఆమె అభిమానులు బిగ్ బాస్ లో శ్రీసత్య కి మాట్లాడే అవకాశం ఇవ్వలేదని సోషల్ మీడియాలో ప్రశ్నించారు.. ఇక శ్రీ సత్య గ్రాండ్ ఫినాలే రోజు ఆమె చేత మాట్లాడించే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఇన్ని రోజులు హౌస్ లో ఉన్న శ్రీ సత్య కి ఇలాంటి అవమానం జరిగిందని ఆమె అభిమానులు సన్నిహితులు చెబుతున్నారు.. శ్రీ సత్య మాత్రం బిగ్ బాస్ నన్ను గుర్తుంచుకున్నారు. కచ్చితంగా మంచి ఛాన్స్ ఇస్తారని ఆమె సన్నిహితులతో చెప్పినట్టు తెలుస్తోంది. నాగార్జున సార్ నన్ను చివరకు ఇంటి నుంచి మాట్లాడనివ్వకపోవడం నాకు బాధ కలిగించిందని శ్రీసత్య ఒక ఇంటర్వ్యూ లో కన్నీళ్లు పెట్టుకున్నారు.