Smart TV Offers : స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ అందుబాటులో ఉంది. సాధారణంగా ఇప్పటివరకు పలు బ్రాండ్ కంపెనీలు తమ స్మార్ట్ టీవీ లపై ఆఫర్లను మాత్రమే ప్రకటించాయి. కానీ ఇక్కడ ఒక బ్రాండ్ ఏకంగా రూ.22,000 విలువైన స్మార్ట్ ఫోన్ ని కూడా ఉచితంగా అందించడానికి సిద్ధమయింది. ఇక ఈ ఆఫర్స్ కళ్ళు చెదిరే విధంగా ఉండడం గమనార్హం. ఇక అంతేకాదు రిఫ్రిజిరేటర్ , వాషింగ్ మిషన్ ఇలా పలు ఉత్పత్తులపై కూడా భారీగా ఆఫర్లు అందుబాటులోకి రావడం గమనార్హం.
దిగ్గజ ఎలక్ట్రానిక్ కంపెనీలలో ఒకటైన సాంసంగ్ మార్కెట్లోకి కొత్త స్మార్ట్ టీవీలను తీసుకొచ్చింది. అందులో సెరో, సెరిఫ్, మైక్రో ఎల్ఈడి టీవీ, నియో క్యూ ఎల్ఈడి టీవీలు ఉన్నాయి. అంతే కాదు ఫ్రేమ్ బ్రాండ్ కింద 2022 సిరీస్ టీవీ మోడల్ ని కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం ఈ శాంసంగ్ ఫ్రేమ్ స్మార్ట్ టీవీ ధరను చూస్తే 43 అంగుళాల టీవీ ధర రూ.61,990 గా ఉంది. ఇక 50 అంగుళాల టీవీ ధర రూ.73,990 అలాగే 55 అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ.91,990. ఇక 65 అంగుళాల స్మార్ట్ టీవీ ధరను కంపెనీ రూ.1,27,990 గా నిర్ణయించడం జరిగింది. ఇక చివరిగా 75 అంగుళాల టీవీ ధర రూ.2,99,990 వద్ద నిర్ణయించడం గమనార్హం.
ప్రస్తుతం ఈ శాంసంగ్ టీవీలు సాంసంగ్. కామ్, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఆన్లైన్ స్టోర్ లలో అలాగే ప్రముఖ రిటైల్ స్టోర్ లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీలను కొన్నవారికి సాంసంగ్ కంపెనీ ఉచితంగా స్మార్ట్ ఫోన్ అందిస్తోంది. ఫ్రేమ్ సహా పలు బ్రాండ్ల టీవీలకు ఇది వర్తిస్తుంది. ముఖ్యంగా సాంసంగ్ అధికారిక ఆన్లైన్ స్టోర్ లేదా ఎక్స్క్లూజివ్ స్టోర్ లోకి వెళ్లి కొనుగోలు చేస్తేనే ఈ బెనిఫిట్ వర్తిస్తుంది.. అంతేకాకుండా బ్యాంకు కార్డులపై 22% క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా లభిస్తుంది . మరి ఇంకెందుకు ఆలస్యం ఆఫర్ కొద్ది రోజులే ఉంటుంది త్వరపడండి..