YS Viveka Case : కోడికత్తి కేసులో బాధితుడైన ఏపీ సీఎం అప్పటికి ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డికి ఎన్ఐఏ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో సాక్షిగా వచ్చే నెల 10న విజయవాడలోని ఎన్ఐఏ కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి ఆంజనేయ మూర్తి ఆదేశాలను ఇచ్చారు. దాడి జరిగిన సమయంలో విశాఖ విమానాశ్రమంలో కమాండెంట్ గా విధులు నిర్వహిస్తున్న దినేష్ కుమార్ కోర్టులో సాక్ష్యం చెప్పారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.

దాడి కి ఉపయోగించిన కత్తిని సంఘటన స్థలంలోనే స్వాధీనం చేసుకున్నారా.? అని క్రాస్ ఎగ్జామినేషన్లో భాగంగా నిండితుడు శ్రీనివాసరావు తరుపు న్యాయవాది సలీం కమాండెంట్ ను ప్రశ్నించారు. ఆ స్థలం నుంచి స్వాధీనం చేసుకోలేదని కాసేపటికి వైయస్సార్సీపి కార్యకర్త చిన్న శ్రీను కత్తిని తెచ్చి ఇచ్చారని న్యాయమూర్తి ఎదుట వెల్లడించారు. దాడిని ప్రత్యక్షంగా చూడలేదని న్యాయవాది సలీం అడిగిన మరో ప్రశ్నకు కమాండెంట్ బదులు సమాధానం ఇచ్చారు.
2018లో విశాఖ విమానాశ్రయంలో జగన్ పై దాడి ఘటనలు నిండుటయినా శ్రీనివాసరావు నుండి స్వాధీనం చేసుకున్న వస్తువులను ఎన్ఐఏ అధికారులు కోర్టులో సమర్పించారు. ఈ విషయంలో జాప్యం పై గతవారం విచారణ సందర్భంగా న్యాయమూర్తి ప్రశ్నించారు. దీంతో మిగిలిన వస్తువులైన రెండు కత్తులు, ఒక పర్సు, సెల్ఫోన్, బెల్టు, మరియు ఏటీఎం కార్డు. రూ. 10 నోటుకు కోర్టుకు అప్పగించారు.