Mahasena Rajesh : వివేకా కేసులో సంచలన నిజాలను ప్రూఫ్స్ తో సహా బయట పెట్టిన మహసేనా రాజేష్..

Mahasena Rajesh : వైయస్ వివేకానంద రెడ్డి ప్రాణాలు తీసిన కేస్ వైసీపీని వెంటాడుతోంది. ఈ కేసులో తీగలాగితే డొంకంతా కదులుతుంది. కేసు విచారణ వేగవంతం కావడంతో సీఎం జగన్ లోనూ టెన్షన్ పెరుగుతుంది. ఈ కేసు దర్యాప్తు అధికారిక పార్టీ నేతలు ఆందోళన రేపుతోందని ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అర్థమవుతుంది.. అయితే ఈ కేసు పై కొన్ని నిజాలను మహాసేన రాజేష్ బయట పెడుతూ.. ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది..

వైయస్ వివేకానంద రెడ్డి బద కేసులో మీరు కొన్ని నిజాలను గమనించాలని.. తన స్క్రీన్ మీద కొన్ని నిజాలను చూపిస్తూ చెప్పారు వైఎస్ వివేకానంద రెడ్డి మరణించిన తరువాత వైయస్ అవినాష్ రెడ్డి ఏ విధంగా మాట్లాడారు ..జగన్ ఏ విధంగా మాట్లాడారో ఆ మాటలను వినిపించి.. జగన్ తో పోలిస్తే అవినాష్ రెడ్డి మంచివారని అన్నారు.

వివేకానంద మరణించిన వెంటనే జగన్ చిన్నాన్న పోస్ట్మార్టం రిపోర్ట్ లో డెడ్లీ వెపన్ ఉందని.. రిపోర్టు రాకముందే జగనన్న చెప్పారని.. అంటే కచ్చితంగా ఆయనకు బాబాయి ప్రాణాలు తీసింది ఎవరో తెలుసా అని అన్నారు. అందుకే ముందుగా గుండెపోటు, రక్త విరోచనాలు అని చెప్పి ఆ తరువాత కథను ఈ విధంగా మలుపు తిప్పారని నా రాజేష్ గుర్తు చేశారు. అదేవిధంగా చంద్రబాబునాయుడు అప్పుడు అధికారంలో ఉన్నారు ఇదంతా నారాసుల రక్త చరిత అంటూ అప్పట్లో ప్రచారం చేశారు. కానీ వివేక చనిపోయిన వెంటనే చంద్రబాబు నాయుడు ఏ విధంగా మాట్లాడారో.. ఆ మాటలను కూడా వినిపించి ..ఈ కేసును అంత తేలికగా వదిలిపెట్టనని కచ్చితంగా న్యాయం జరిగేలాగా చేస్తానని ఆయన అన్నారు .

అదేవిధంగా డేడ్లీ వెపన్స్ ఉన్నాయని తెలియగానే వారి స్వరం మారిందని చంద్రబాబు మాట్లాడిన మాటలు వినిపిస్తూ ఈ వీళ్లిద్దరూ మాట్లాడిన మాటలను వింటే అసలు ఎవరు ఏం చేశారో.. మీకే ప్రత్యక్షంగా అర్థమవుతుంది అంటూ మహాసేన రాజేష్ వివేక కేసు పై కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్రూఫ్స్ ను బయటికి తీశారు. జగన్ వైపు తప్పు ఉందని తెలుసుకున్న ఆ పార్టీ నేతలే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పార్టీలోకి రావడం శుభ పరిణామం అని ఆయన అన్నారు.