భాస్కర్ రెడ్డి విచారణకు కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌజ్ కు వెళ్లారు. కాగా మంగళవారం రోజు భాస్కర్ రెడ్డిని, అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించనున్నట్లు సమాచారం. భాస్కర్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి పలు విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. విచారణ తేదీని సీబీఐ అధికారులు మళ్లీ తెలియజేస్తామని చెప్పారని అన్నారు. వధ జరిగిన స్థలంలో దొరికిన లెటర్ పై సీబీఐ ఎందుకు విచారణ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.
వైయస్ భాస్కర్ రెడ్డి మీ అబ్బాయి అవినాష్ రెడ్డితో పాటు మిమ్మల్ని కూడా అదుపులోకి తీసుకుంటామంటూ.. సీబీఐ తరఫున న్యాయవాది తెలంగాణ హైకోర్టుకు తెలియజేసిన అంశాన్ని మీడియా వారు అడుగగా.. మేము దేనికైనా సిద్ధమని భాస్కర్ రెడ్డి అన్నారు. న్యాయం కోసం ఎదురు చూస్తూ ఉంటామని అన్నారు.భాస్కర్ రెడ్డిని సీబీఐ గత ఏడాది పులివెందులలో రెండు రోజులు విచారణ చేసింది.
రేపు అవినాష్ రెడ్డి రిట్ పిటిషన్ పై హైకోర్టు లో విచారణ జరగనున్న సంగతి తెలిసిందే. ఇక తనని విచరించేటప్పుడు రికార్డ్ చేసిన ఆడియోలు, వీడియోలను నేడు హార్డ్ డిస్క్ లో కోర్ట్ ముందు సీబీఐ అధికారులు ఇవ్వనున్నారు. కేసు డైరీ ని కోర్ట్ కి షీల్డ్ కవర్ లో అందజేసేందుకు సీబీఐ సిద్ధంగా ఉంది.