Categories: ExclusiveNewsPolitics

pawan Kalyan : ఐటి విభాగంపై దృష్టిపెట్టరా ?

pawan Kalyan : రాజకీయపార్టీలన్నాక ప్రచారం చాలా చాలా ముఖ్యం. ఒకపుడు సంప్రదాయపద్దతిలో ఎన్నికలు వచ్చినపుడు ప్రచారం చేస్తే సరిపోయేది. కానీ ఇపుడు అలా సరిపోదు. కచ్చితంగా ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతుండాల్సిందే. దాని ప్రకారం ప్రతిరోజు ప్రచారం చేసుకోవాల్సిందే. అధికారంలో ఉన్నపార్టీయా లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలా అనేదానితో సంబంధంలేదు. ఇపుడు మీడియాను సోషల్ మీడియా బాగా డామినేట్ చేస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో కూడా అప్ డేట్ అవ్వాల్సిందే.

ఇదంతా ఇపుడెందుకంటే షెడ్యూల్ ఎన్నికలకు ఇక ఉన్నది రెండేళ్ళు మాత్రమే. చెప్పుకోవటానికి ఇంకా రెండేళ్ళుందని అనుకున్నా ఎన్నికల హీట్ మాత్రం విపరీతంగా పెరిగిపోతోంది. ఒక వైపు చంద్రబాబునాయుడు మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్యంతర ఎన్నికలు తధ్యమని పదే పదే చెబుతుండటంతో ఎన్నికల హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దాంతో అన్నీపార్టీలు సోషల్ మీడియాను బలోపేతం చేసుకుంటున్నాయి.

సోషల్ మీడియా ప్రచారంలో ఒకపుడు తెలుగుదేశంపార్టీ బాగా బలంగా ఉండేది. 2019 ఎన్నికల్లో ఘోరపరాజయం తర్వాత ఎందుకనో సోషల్ మీడియా వింగ్ బాగా బలహీనపడింది. ఇపుడిప్పుడు మళ్ళీ పుంజుకుంటోంది. ఇదే సమయంలో వైసీపీ సోషల్ మీడియా వింగ్ కూడా బలంగానే ఉంది. రెండుపార్టీల మధ్య సోషల్ మీడియా వేదికగా ఏస్ధాయిలో యుద్ధం జరుగుతోందో అందరు ప్రత్యక్షంగా చూస్తున్నదే. మరి రెండు ప్రధాన పార్టీల మధ్య అంతలా యుద్ధం జరుగుతున్నపుడు జనేసేన ప్లేస్ ఏమిటి ?

నిజానికి సినిమా అభిమానిగా పవన్ కల్యాణ్ కున్న ఫ్యాన్ బేస్ ఇంకెవరికీ లేదు. సోషల్ మీడియాలో ప్రత్యేకించి ఫేస్ బుక్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అయితే అదంతా ఒకదారీ తెన్ను లేకుండా నడుస్తున్న ఫాలోయింగ్. అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంతున్నా రాజకీయపార్టీగా జనసేనకు ఏమాత్రం ఉపయోగం ఉండదు. ప్రత్యేకించి పార్టీ తరపున పనిచేయటానికి సోషల్ మీడియా విభాగం బలంగా ఉండాలి. ఇపుడు జనసేనలో ఈ విభాగం పనిచేస్తోంది కానీ చాలా పరిమితసంఖ్యలోనే పనిచేస్తోంది.

సోషల్ మీడియా విభాగం జిల్లాలు, నియోజకవర్గాల స్ధాయిలోకి కూడా చొచ్చుకుని వెళ్ళాలి. తాజాగా ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో సోషల్ మీడియా విభాగం కోఆర్డినేటర్లను నియమించారు. అయితే ఇలాంటి నియామకాలు 175 నియోజకవర్గాల్లోను జరగాలి. వీటిని పర్యవేక్షించేందుకు, గైడెన్స్ ఇచ్చేందుకు, స్పీడు పెంచేందుకు మంగళగిరి కార్యాలయంలో బలమైన నిపుణులు కావాలి. ఈ నిపుణులు 24 గంటలూ, 365 రోజులూ పార్టీ పనిలోనే ఉండాలి.

ఇలాంటి బలమైన సోషల్ మీడియా విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నపుడే పవన్ ఆలోచనలు, విధానాలను సోషల్ మీడియా జనాల్లోకి తీసుకెళ్ళగలవు. ఒకటి పవన్ కు మద్దతుగా సోషల్ మీడియా పనిచేస్తూనే ప్రతిపక్షాలపై దండయాత్రలు చేస్తుండాలి. వైసీపీ నేతలతో పాటు ప్రతిపక్షాల నేతలు ఏమి చేస్తున్నారు ? ఏమి మాట్లాడుతున్నారనే విషయాలను ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతు కౌంటర్లు ఇస్తుండాలి. అప్పుడే పార్టీ జనాల్లోకి వెళ్ళగలుగు తుంది.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

4 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

5 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

5 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

6 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

6 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

7 months ago

This website uses cookies.