Shariff Mohammed Ahmed : మహ్మద్ అహ్మద్ షరీఫ్ టిడిపి 41వ ఆవిర్భావ దినోత్సవ సభలో పాల్గొని ఆయన ప్రసంగించారు. ఈ సభలో ఆయన మాటలు ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషనల్ గా నిలిచాయి. తెలుగుదేశం పార్టీ పెట్టడమే చారిత్రకం. ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించిన నందమూరి తారకరామారావు.. ఈనాడు తెలుగు జాతికి గౌరవ ప్రతీక ఆంధ్ర తో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా టిడిపి మళ్లీ పునికి పుచ్చుకోవాలని ఆ అవసరం చాలా ఉంది అని షరీఫ్ అన్నారు.
తెలుగువారి గౌరవాన్ని ప్రతికాన్ని ఈ రాష్ట్రాలలోనే కాకుండా ఈ దేశంలోనే కాకుండా, దేశ విదేశాల్లో ప్రపంచంలోనే తెలుగువారి ప్రతిష్టను పెంపొందించి తెలుగు వారి జాతిని నిలబెట్టింది తెలుగుదేశం పార్టీ.. ఆనాడు నిలబెట్టింది ఈ నాలుగు నిలబడుతుంది భవిష్యత్తులో నిలబెట్టేది కూడా తెలుగుదేశం పార్టీనే.. తెలుగు జాతి పౌరుషానికి ఈ పార్టీ ప్రతీక అవుతుంది. యువత కోసం వారి ఉద్యోగాల కల్పన కోసం అనునిత్యం పాటుపడే పార్టీ టిడిపి అని షరీఫ్ అన్నారు.
నేను తెలుగుదేశం పార్టీలో 22 ఏళ్లకు పైగా ఉన్నాను. ఇన్ని సంవత్సరాలు ఒక పార్టీలో ఉండడం అది తెలుగుదేశం పార్టీకే సొంతమవుతుందని.. భవిష్యత్తులో నేటి యువత కూడా ఈ పార్టీపై దృష్టి పెట్టాలని ఆయన గుర్తు చేశారు. నేటి యువత టిడిపి పై దృష్టి సారించాలని సూచించారు.
నందమూరి తారక రామారావు ఒక్క రూపాయికి ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. ఎన్నో సంక్షేమ పథకాలని ప్రజల కోసం తీసుకువచ్చారని షరీఫ్ గుర్తు చేసుకున్నారు. ఆయనే కనుక ఇలాంటి పథకాలను తీసుకురాక పోయి ఉంటే ప్రజలు ఏమైపోయి ఉండేవారు అని అన్నారు..
కానీ ఇప్పటి వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను మనకు ఇస్తున్నట్టే ఇచ్చి మన జేబుకి కన్నం పెడుతున్నాయని ఆయన గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలను తీసుకువచ్చినట్టే తీసుకువచ్చి నిత్యవసర సరుకులతో పాటు ఎన్నో విషయాలలో మన జేబుకి కన్నం వేస్తుందని.. అది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని మహమ్మద్ అహ్మద్ షరీఫ్ వైసీపీకి మాస్ కౌంటర్ ఇచ్చారు.