Mohan Babu : వైయస్ వివేకానంద రెడ్డి హత్య పై మోహన్ బాబు సీరియస్ కామెంట్స్..!!

Mohan Babu : 2019 ఎన్నికల సమయంలో నటుడు మోహన్ బాబు వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. జగన్ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్రవ్యాప్తంగా అనేక సభలలో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. వైసీపీకి తన మద్దతు ప్రకటించి.. జగన్ ముఖ్యమంత్రి కావటంలో ప్రముఖ పాత్ర పోషించారు. మోహన్ బాబు నటుడిగా మాత్రమే కాక అంతకుముందు పొలిటికల్ నేతగా కూడా తెలుగు రాజకీయాలలో తన కంటి సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. 2019 ఎన్నికల సమయంలో జగన్ కి మద్దతు తెలిపి వైసీపీ పార్టీ గెలవడంలో ప్రముఖ పాత్ర పోషించారు.Mohan Babu's Serious Comments on YS Vivekananda Reddy's Murder

అయితే ఆ సమయంలో వైయస్ వివేకానంద రెడ్డి హత్య చేయబడటంపై మోహన్ బాబు స్పందించిన వీడియో తాజాగా వైరల్ అవుతూ ఉంది. ఆయన అజాతశత్రువు పదిమందికి సహాయం చేసే వ్యక్తి. కావాలని వైయస్ వివేకానంద రెడ్డిని హత్య చేయించారని సంచలన ఆరోపణలు చేశారు. మంచి వ్యక్తులకి ఈ విధంగా జరగటం చాలా అన్యాయం. ఈ విషయంలో అటువంటి ఘాతుకానికి పాల్పడిన నరరూప రాక్షసులను పట్టుకోవడానికి పోలీసులు న్యాయబద్ధంగా వ్యవహరించాలని మోహన్ బాబు మీడియా సాక్షిగా కోరిన వీడియో సంచలనంగా మారింది.

వైయస్ వివేకానంద రెడ్డి నాకు బంధువు. ఆయనను చూస్తే చాలా ఆశ్చర్యమేస్తది. అరాచకాలు ఏమిటి ఎవరు చేస్తున్నారు అనేది భగవంతుడు పైనుండి అంతా చూస్తున్నాడు. ప్రతి ఒక్కరికి పగలు ఉంటుంది రాత్రి ఉంటుంది. అందరూ విడిచిపెట్టిన గాని ప్రకృతి విడిచిపెట్టదు.. అంటూ మోహన్ బాబు చేసిన కామెంట్స్ వీడియో తాజాగా వైరల్ అవుతుంది. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకి సంబంధించి విచారణ ఈ నెల 30వ తారీకు ముగియనుంది. ఈ క్రమంలో వైసీపీ నేతల పేర్లు చివరిలో వస్తూ ఉండటంతో అసలు ఈ కేసులో ఎవరు అరెస్ట్ అవుతారు అన్నది… కీలకంగా మారనుంది.