Kethi Reddy : కేతి రెడ్డి అమ్మగారి వీడియో వైరల్ అవుతోంది .. మీరు ఎప్పుడైనా చూసారా !

Kethi Reddy : కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ధర్మవరం నియోజకవర్గ ప్రజలతో పాటు ఏపీలో అందరికీ సుపరిచితమే.. సాధారణ ఎమ్మెల్యే లాగా కాకుండా.. కూల్ గా కనిపిస్తూ హార్డ్ వర్క్ చేసుకుంటూ ప్రజల సమస్యలను అక్కడికక్కడే తీర్చే కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి పలకరింపు నుంచి పనితనం వరకు ప్రతి విషయంలోనూ ప్రత్యేకమే.. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ప్రతిరోజు కాలనీలో కనిపిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరిస్తారు కేతిరెడ్డి.. కాగా తాజాగా కేతిరెడ్డి అమ్మ కళావతమ్మ ఆయనతోపాటు కలిసి గుడిలో కనిపించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

13 అక్టోబర్ 1980 లో సూర్య ప్రతాప్ రెడ్డి, కళావతమ్మా దంపతులకు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి జన్మించారు. ఆయన తమిళనాడు లోని భారతియుర్ యూనివర్సిటీ నుంచి 2001 లో బీటెక్ పూర్తి చేశారు. కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. 2006 తండ్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సూర్య ప్రతాపరెడ్డి మరణాంతరం ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చారు.. ఆయన 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ధర్మవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి గోనుగుంట్ల సూర్యనారాయణ పై 19 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఆయన వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 2013లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి అడుగు పెట్టారు. కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి 2014లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పోటీ చేసి 14 వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు. 2019లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి 17 ఓట్ల మెజారిటీతో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.

కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గుడ్ మార్నింగ్ తో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ ఎమ్మెల్యేగా దూసుకెళ్తున్నారు. చిన్న, పెద్ద , ముసలి వాళ్లు ఉన్న తేడా లేకుండా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తుంటారు. ప్రతిపక్ష పార్టీలపై ఘాటుగా విమర్శలు చేసే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రజలతో మాత్రం ఎంతో సరదాగా ఉంటారు. ఆయన చేసిన చమత్కారాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. బాగున్నావా పెద్దమ్మ.. బాగున్నావా పెద్దాయన.. బావున్నావా అక్క.
ఏరా చిన్న.. ఏం హీరోస్ అని పలకరింపులతో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గుడ్ మార్నింగ్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో జరిగిన ఫన్నీ సన్నివేశాలు చాలానే ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలపై ఘాటుగా విమర్శలు చేసే ఎమ్మెల్యే తన ప్రజలతో మాత్రం చాలా సరదాగా గడుపుతారు. వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటారు.