Andhra Pradesh.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం హీటెక్కుతోంది. నేతలు పార్టీ మారుతున్న నేపథ్యంలో పొత్తుల వ్యవహారం అనధికారికంగా ఖరారు అవుతున్నాయి. ఇదే సమయంలో పార్టీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు వేగవంతం చేశాయి పార్టీలు.. ఇకపోతే తాజాగా సర్వే సంస్థలు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని.. దానిపైన సర్వేలు చేయగా టీడీపీ, జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తున్నా.. ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు.. వైసీపీ తిరిగి అధికారం తమదేనని ధీమాగా ఉంది.. అయితే సర్వే సంస్థలు మాత్రం టీడీపీ – జనసేన పొత్తు కలిస్తే గెలిచే గ్యారెంటీ ఉంది అంటూ విశ్లేషణలు కూడా మొదలయ్యాయి.
ఇప్పుడు ఏపీలో తాజా పరిస్థితులపై అధ్యయనం చేసిన ఒక సర్వే.. గెలుపు ఎవరికి దక్కుతుందో తెలిసింది. టీడీపీ – జనసేన పొత్తుతో ఎన్నికల్లో పోటీ చేస్తే వైసీపీకి 110 స్థానాలు దక్కే అవకాశం ఉందని, టీడీపీ కి 55 స్థానాలు, జనసేనకి ఆరు సీట్ల వరకు గెలిచే అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ టిడిపి , జనసేన పొత్తు లేకుండా వేరువేరుగా పోటీ చేస్తే అధికార వైసీపీకి 130 వరకు స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికైతే ఈసారి మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చేటట్టు కనిపిస్తోంది.