Xiaomi : షావోమి.. తాజాగా టెక్ అభిమానులకు శుభ ముహూర్త సేల్ తీసుకువచ్చింది. ఇందులో భాగంగానే భారీ ఆఫర్లను సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా డోంట్ బై అనే ట్యాగ్ లైన్ కూడా ప్రమోట్ చేస్తూ వస్తుంది గ్రేటెస్ట్ దీపావళి సేల్ వచ్చేస్తుందంటూ కస్టమర్లను ఊరిస్తోంది షావోమి.. అంతేకాదు దివాలీ విత్ షావోమీ అంటూ కస్టమర్లకు అందించడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ సేల్ ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే విషయాన్ని మాత్రం కంపెనీ త్వరలోనే ప్రకటిస్తాము అని కూడా వెల్లడించడం జరిగింది. ఇకపోతే సేల్ లో భాగంగా 500 మంది లక్కీ విజేతలకు ₹10,000 విలువైన ఎక్స్క్లూజివ్ కూపన్స్ లభించనున్నాయి. ఇకపోతే ప్రతిరోజు కూడా క్రేజీ డీల్స్ ఆవిష్కరణ ఉంటుంది అని షావోమీ వెల్లడించింది.
ఇకపోతే గేమ్ కాంటెస్ట్ సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభం అవుతుందట. ఇక దీవాలి గేమ్ రూమ్ కాంటెస్ట్ నిర్వహించనుంది. ఇందులో భాగంగా కస్టమర్ లు విలువైన బహుమతులను ఉచితంగా సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు ఇందులో స్పిన్ ద వీల్ సెక్షన్ కూడా ఉంటుంది. ఇందులో భాగంగానే కస్టమర్స్ వీల్ ను తిప్పి ఉచిత షావోమి స్మార్ట్ టీవీ ని గెలుపొందొచ్చు. అంతేకాదు స్మార్ట్ ఫోన్లు కూడా ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ స్పిన్ ద వీల్ కాంటెస్ట్ అనేది సెప్టెంబర్ 15వ తేదీ నుంచి మొదలవుతుంది అని షావోమీ స్పష్టం చేసింది. అలాగే సూపర్ స్లాట్ మిషన్ అనే సెక్షన్ కూడా ఉంది. ఇందులో పాల్గొని విజేతగా గెలిస్తే ఉచితంగా రెడ్మి నోట్ 11S ఈ స్మార్ట్ ఫోన్ సొంతం చేసుకోవచ్చు .
ఇది కూడా సెప్టెంబర్ 15వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అంతేకాదు పటాకా రన్ కాంటెస్ట్ కూడా నిర్వహిస్తోంది షావోమి. సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభం అవుతుంది. ఇందులో పాల్గొని విజేతగా గెలిచిన వారికి ఉచితంగా స్మార్ట్ ఫోన్స్ పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు దీవాలి ఆఫర్ల కింద కొత్త కొత్త ప్రోడక్ట్లను కూడా మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. అయితే ఏ ప్రోడక్ట్లను మార్కెట్లోకి తీసుకువస్తోంది అనే విషయం తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. రెడ్మీ రష్ అవర్స్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉండనున్నాయి. ఇక ఇందులో భాగంగానే టీవీలు, స్మార్ట్ ఫోన్లు, లాప్టాప్స్ పై భారీ తగ్గింపు ధరలు అందుబాటులోకి వస్తాయి. అయితే ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఈ సేల్ ప్రారంభం అవుతుంది.