Virupaksha: టీజర్ తోనే అదరగొట్టేస్తున్న సాయి ధరమ్ తేజ్..!

Virupaksha.. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఇప్పుడు విరూపాక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించబోతున్నారు.. ఈ సినిమాకు డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందించగా కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్ విడుదల చేయగా భారీ రెస్పాన్స్ అందుకోవడం జరిగింది.

Virupaksha Teaser Set to Release at a Specific Time

ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేయడం జరిగింది.. చరిత్రలో ఇలాంటి ఒక ఘటన జరగడం ఇదే మొదటిసారి.. దీని నుంచి బయటపడడానికి ఒకే ఒక్క మార్గం ఉంది అనే డైలాగ్ తో ఈ టీజర్ మొదలవుతుంది. ఒక ఊరు ఆ ఊరిలో జనాల మూఢనమ్మకాలు..ఒక సమస్య వల్ల తలెత్తిన చావులు.. ఆ మిస్టరీ చేజ్ చేయడానికి బయలుదేరిన హీరో.. ఇదే థీమ్ తో విరూపాక్ష టీజర్ ను రిలీజ్ చేయడం జరిగింది. సస్పెన్స్ అండ్ ఇంటెన్సిటీకి గురి చేసే ఎలిమెంట్స్ ఈ సినిమాలో చాలా ఉన్నాయని తెలుస్తోంది. మరి ఏ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.