Krishna : మనదేశంలో సినీ, క్రీడా ప్రముఖులకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారి కోసం ఫ్యాన్స్ ఏం చేయాడానికి అయినా రెడీగా ఉంటారు. వారిని చూడటం కోసం ఎంత దూరమైనా వెళ్లడం, వాళ్ల దృష్టి తమపై పడేందుకు ఏమైన చేయడం వంటివి చేస్తుంటారు. అయితే తెలుగు సినీ చరిత్రల తనకంటూ ప్రత్యేక అధ్యాయం ఏర్పరచుకున్న కృష్ణ ఇటీవల కాలం చేయడంతో, ఆయనను చివరి చూపు చూసేందుకు ఎంతమంది అభిమానులు వచ్చారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక రీసెంట్గా కృష్ణ పెద్ద కర్మ నిర్వహించడంతో ఆ కార్యక్రమానికి కూడా అభిమానులు భారీగా తరలి వచ్చారు.
32 రకాల వంటకాలు..
హైదరాబాద్లోని జేఆర్సీ కన్వేన్షన్ సెంటర్లో పెద్ద కర్మ నిర్వహించగా, ఈ కార్యక్రమానికి కృష్ణ తనయుడు, స్టార్ హీరో మహేష్బాబుతో పాటు ఆయన కుటుంబసభ్యులు హాజరయ్యారు. నాన్న కృష్ణ తనకు చాలా ఇచ్చాడని, వాటిలో అన్నింటికంటే గొప్పది మీ అభిమానమే అంటూ ఫ్యాన్స్ను ఉద్దేశించి చాలా ఎమోషనల్గా మాట్లాడారు మహేష్ బాబు. నాన్నభౌతికంగా దూరమైనా తన గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతారని, మన అందరి మధ్య ఉంటారని మహేష్బాబు అన్నారు. పెద్దకర్మకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చిన నేపథ్యంలో వారికి 32 రకాల వంటకాలతో భోజనాన్ని పెట్టినట్లు సమాచారం.
ముందుగా ఇంటి వద్ద శాస్త్రోక్తంగా పూజలు చేసిన తరవాత మధ్యాహ్నం అతిథులు విందు ఇచ్చారు. ఈ విందులో 32 రకాల వంటకాలు వడ్డించగా, వాటిలో చికెన్,మటన్, ఫ్రాన్స్, షిష్తో పాటు కొన్ని ఆంధ్రా వంటకాలు, బిర్యానీ, వెజ్ కర్రీస్, పికిల్స్, ఇలా మొత్తంగా 32 రకాల వెరైటీలు వడ్డించినట్టు తెలుస్తుంది. మహేష్ గారు మా కోసం 32 ఐటెమ్స్ పెట్టించారు.మహేష్ అన్నని ఆ దేవుడు చల్లగా చూడాలి అని కొందరు కామెంట్స్ చేయగా, మరికొందరు సూపర్ స్టార్ కృష్ణ గారి ఆత్మకు శాంతి కలగాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు