Tarakaratna pedda karma: తారకరత్న పెద్దకర్మకు ఎవరెవరు హాజరయ్యారో తెలుసా..?

Tarakaratna pedda karma.. నందమూరి తారకరత్న గత ఏడాది 18వ తేదీన గుండెపోటుతో 23 రోజులపాటు మృత్యువుతో పోరాడి శివైక్యం చెందిన విషయం తెలిసిందే. ఇక ఈరోజు ఆయన కుటుంబ సభ్యులు తారకరత్నకు పెద్దకర్మ చేశారు. హైదరాబాదు ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా పూర్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నందమూరి నారా కుటుంబ సభ్యులతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు. నందమూరి బాలకృష్ణ, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, పురందేశ్వరి, విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ తదితరులు హాజరయ్యి తారకరత్న చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు.

నేడు తారకరత్న పెద్దకర్మ.. తరలిరానున్న సినీ, రాజకీయ ప్రముఖులు | tarakaratna  pedda karma happening in film nagar cultural centre

టాలీవుడ్ నుంచి పలువురు సినీ ప్రముఖులు కూడా వచ్చి నివాళి అర్పించారు. అనంతరం చంద్రబాబు నాయుడు అలేఖ్య రెడ్డిని పరామర్శించిన తర్వాత వారి కూతురుతో సరదాగా మాట్లాడారు. రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, నందమూరి బాలకృష్ణ తమ రాజకీయ కార్యక్రమాలను పక్కనపెట్టి మరి తారకరత్న పెద్దకర్మ ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్నారు. ఎన్టీఆర్ కూడా తన సినిమా పూజా కార్యక్రమాలను వాయిదా వేసుకోవడం జరిగింది. అలాగే ఆస్కార్ అవార్డుల కోసం కూడా ఆయన అమెరికా వెళ్ళకుండా ఆగిపోయారు.