Naresh-pavitra : నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి తాజాగా యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో కృష్ణ చనిపోయిన రోజు రాత్రి అసలేం జరిగింది.. నరేష్ పవిత్ర ఎలా వ్యవహరించారన్నది ఆమె ఆధారాలతో సహా బయటపెట్టారు. ఆ రోజు రాత్రి కృష్ణ పార్థివదేహాన్ని ఆయన ఇంట్లోనే ఉంచారు. అంత గొప్ప వ్యక్తి చనిపోతే అసలు ఆ రాత్రి ఆయన దగ్గర ఎవరూ లేరు. మహేష్ బాబుతో పాటు కృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ఆ బాధలో ఉంటూ.. ఉదయం దహన సంస్కారాలు ఉండటంతో.. త్వరగానే నిద్రకు ఉపక్రమించినట్లు ఉన్నారు. ఇక రమ్యా రఘుపతి ఆ రోజు రాత్రి 11 గంటల నుంచి ఉదయం అంత్యక్రియలు చేసే వరకు ప్రతి గంట గంటకు రిపోర్టు ఆధారాలతో సహా చూపించింది..

కాకపోతే మీడియా వాళ్లు, సెలబ్రిటీలు ఉన్నప్పుడు నరేష్, పవిత్ర బాగా హడావిడి చేశారు. ఇక వాళ్లు వెళ్లిపోయిన వెంటనే నరేష్, పవిత్ర కూడా అక్కడ నుంచి వెళ్లిపోయారని.. నేను ఒక్కదానినే ఆ రాత్రంతా కృష్ణ పార్తీవ దేహం దగ్గరే ఆమె ఒక్కతే ఉన్న వీడియో కూడా ఆమె బయట పెట్టారు. ఈ వీడియోలో గంటగంటకు ఏం జరిగిందో ఆమె మొత్తం చూపించారు. 11 గంటలకు కేవలం రమ్య ఒక్కరు మాత్రమే అక్కడ ఉన్నారు. ఇక అలా 12 గంటలకు , రాత్రి 1 గంటకు రమ్య కొడుకు కృష్ణ కి అగరబత్తీలు వెలిగించడం,
2 గంటలకు, 3 గంటలకు కూడా అక్కడ ఎవ్వరూ లేకపోవడం. ఇక 4.15 గంటలకు రమ్య స్వయంగా కృష్ణ ఫోటో వద్ద దీపం వెలిగించారు. అప్పటకి కూడా అక్కడ ఎవ్వరూ లేకపోవడం గమనార్హం. ఇక ఉదయం 6.30 గంటలకు ఆయన పార్తీవదేహాన్ని పద్మాలయకు అంబులెన్స్లో షిఫ్ట్ చేశారని.. కనీసం షిఫ్ట్ చేస్తున్నప్పుడు ఆంబులెన్స్లోకి కూడా నరేష్ రాలేదని.. తాను దగ్గరే ఉండి పంపించానని రమ్య ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణ గారు నరేష్ కు సొంత తండ్రి కాకపోయినా.. నాకు, నరేష్కు పీటల మీద కూర్చొని పెళ్లి చేశారని.. ఆయన ఓ గొప్ప వ్యక్తి అని.. అలాంటి వ్యక్తికి చివర్లో దక్కాల్సిన గౌరవం ఇది కాదని రమ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.