Poorna : ఆకట్టుకునే అందం, అద్భుతమైన నటనతో తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకుంది పూర్ణ. ఈ అమ్మడు బుల్లితెర, వెండితెరపై సత్తా చాటుతున్న సమయంలోనే దుబాయ్కు చెందిన ఓ బడా బిజినెస్మ్యాన్ను సైలెంట్గా వివాహం చేసుకుంది. ఇది జరిగి ఎన్నో రోజులు కాకముందే హీరోయిన్ పూర్ణ తన భర్తకు సంబంధించిన విషయం బయటపెట్టింది. వివరాలలోకి వెళితే పూర్ణ.. దుబాయ్కు చెందిన జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్, సీఈఓ షానిద్ ఆసిఫ్ అలీతో ప్రేమలో పడి, ఆ తర్వాత పెద్దలను ఒప్పించి కుటుంబ సభ్యుల సమక్షంలో అరబిక్ పద్దతిలో వివాహం చేసుకున్నారు.
పాపం పూర్ణ..
బడా బిజినెస్మ్యాన్ షానిద్ ఆసిఫ్ అలీని వివాహం చేసుకున్న తర్వాత సంతోషంతో హీరోయిన్ పూర్ణ చాలా ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియాలో పలు పోస్టులు చేసింది. అదే సమయంలో తన కెరీర్ను ముందుకు సాగిస్తానని కూడా పరోక్షంగా చెప్పుకొచ్చింది. మరోవైపు తన భర్త బిజినెస్కి సంబంధించిన విషయాలు కూడా పలు విషయాలు షేర్ చేస్తూ వస్తుంది. తాజాగా తన భర్త పేరుతో జరుగుతున్న మోసానికి సంబంధించిన విషయం కూడా తెలియజేసింది.
గతన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ వాట్సాప్ నెంబర్ డీటేల్స్తో కూడిన పిక్ షేర్ చేయగా, ఇందులో ఆమె భర్త ఫొటో డీపీగా ఉంది. ఇది చూసి ముందు పూర్ణ నిజంగా తన భర్త మోసగాడేమోనని చాలా కుమిలిపోయింది. ఇలాంటి వాడిని చేసుకున్నానా అని తెలిసి వెక్కి వెక్కి ఏడ్చింది. కాని అసలు విషయం తెలుసుకున్న తర్వాత ‘పైనున్న నెంబర్తో నా భర్త పేరిట కొందరు మోసాలు చేస్తున్నారని, తాజాగా ఆ విషయం గుర్తించాను అని చెప్పుకొచ్చింది. దీని ద్వారా వాళ్లు చాలా మందిని కాంటాక్ట్ చేసి మోసం చేస్తున్నారు’ అని పూర్ణ వాపోయింది. షానిద్ పేరుతో ఎవరైనా మీకు వాట్సాప్ కాల్ చేస్తే అస్సలు స్పందించవద్దు. దీనిద్వారా ఎవరైనా నష్టపోతే దానికి మేము బాధ్యులం కాదు అని నెటిజన్స్ ని అప్రమత్తం చేసింది.