Pawan Kalyan: జనసేన పార్టీ పదవ ఆవిర్భావ దినోత్సవం..!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ 10 వ ఆవిర్భావ దినోత్సవ సభ మార్చి 14వ తేదీన మచిలీపట్నంలో నిర్వహించబోతున్నట్లు నాదేండ్ల మనోహర్ ప్రకటించడం జరిగింది. మార్చి 14న మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఈ సభ ప్రారంభానికి పవన్ కళ్యాణ్ వారాహి వాహనంతో చేరబోతున్నట్లు తెలుస్తోంది. దారి పొడవునా ప్రజలను కలుసుకుంటూ వారి యొక్క సమస్యలను తెలుసుకుంటారని తెలియజేయడం జరిగింది. ఇక పదోవ ఆవిర్భావ దినోత్సవ సభలో ప్రజల యొక్క సమస్యలను కూడా తెలియజేయవచ్చు అన్నట్లుగా తెలియజేయడం జరిగింది.

Andhra Pradesh: All set for Jana Sena formation day meeting in Mangalagiri  today

తుఫాన్ సమయంలో రైతులకు పవన్ అండగా నిలిచారని అందుకోసమే మచిలీపట్నం నుంచి ప్రజలు ముందుకు వచ్చి సభ పెట్టబోతున్నట్లుగా మనోహర్ తెలియజేయడం జరిగింది. దాదాపుగా 34 ఎకరాలలో ప్రత్యేకంగా సభ ఏర్పాటు చేస్తున్నారని భద్రతాపరంగా అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ప్రకటించారు. ముఖ్యంగా ఎంతోమంది మహనీయుల గురించి చెప్పేలా అక్కడ కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నట్లుగా తెలియజేశారు. పవన్ కళ్యాణ్ ఈ సభకు హాజరై మంగళగిరిలోని వారాహి వాహనంలో పవన్ బయలుదేరుతారని తెలిపారు. ప్రజల కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసమే పవన్ కళ్యాణ్ ను ఆదరించాలని కోరినట్లు తెలియజేశారు నాదెండ్ల మనోహర్.