Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం..!

Kishan Reddy.. తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన మేనల్లుడు జీవన్ రెడ్డి.. ఒక్కసారిగా ఇంట్లో అస్వస్థకు గురయ్యారు. వెంటనే ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిన కాంచన్ బాగ్ లో ఉన్న అపోలో ఆసుపత్రికి తరలించగా.. ఆయనను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. ప్రస్తుతం కిషన్ రెడ్డి నోయిడా లో ఉన్నారు.. ఈ వార్త తెలియగానే వెంటనే హైదరాబాద్ కి బయలుదేరినట్లు తెలుస్తోంది.. కిషన్ రెడ్డి అక్క లక్ష్మి, బావ నరసింహారెడ్డి దంపతులకు కుమారుడు జీవన్ రెడ్డి.

Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట విషాదం | Central Tourism Minister G Kishan Reddy relative jeevan reddy expired in DRDO Apollo hospital, nrao

ప్రస్తుతం ఆయన అకాల మరణంతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దుఃఖసాగరంలో మునిగిపోయారు.. ఇకపోతే కిషన్ రెడ్డి అక్క , బావ కుటుంబం సైదాబాద్ వినయ్ నగర్ లో నివాసం ఉంటున్నారు.. జీవన్ రెడ్డి అంత్యక్రియలు శనివారం ఉదయం జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. జీవన్ రెడ్డికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు .. ఈ వార్త తెలియగానే పలువురు బిజెపి నేతలు , కార్యకర్తలు పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి నివాసానికి చేరుకుంటున్నారు. ఇకపోతే 50 సంవత్సరాల వయసులో జీవన్ రెడ్డి మరణించడం తో ఆయన ఏ కారణాల చేత మరణించారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.