Kanna Lakshmi Narayana తాజాగా బీజేపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోని జనసేనతో పొత్తు విషయంలో బీజేపీ రెండు నాలుకల ధోరణి అవలంబిస్తోంది అని మాజీ మంత్రి, ఇప్పుడు టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. జనసేనతో పొత్తు ఉంటుందని బీజేపీ నాయకులు బయటకు చెబుతుంటారు.. కానీ లోపల మాత్రం పొత్తులు ఉండవని అంటున్నారు.. భీమవరం డిక్లరేషన్ లో కూడా జనసేన పేరు ప్రస్తావించలేదు అని కన్నా లక్ష్మీనారాయణ గుర్తు చేశారు..
ఒకవేళ ఎవరైనా జనసేనతో పొత్తు విషయమై ప్రశ్నిస్తే.. చంద్రబాబు ఏజెంట్ అనే ముద్ర వేస్తున్నారు. రాజధాని అమరావతిపై నేను మాట్లాడినప్పుడు కూడా నా పైన ఇలాంటి ముద్ర వేశారు. రాష్ట్రంలో రాక్షస పాలనకు ముగింపు పడాలి.. రాజధానిగా అమరావతి అభివృద్ధి జరగాలన్నా కూడా అది టీడీపీ తోనే సాధ్యమవుతుంది. అందుకే టీడీపీ పార్టీలో చేరాను.. ఇప్పుడు వైసీపీలో ఉన్నవారు కూడా మనసు చంపుకొని నియంత వద్ద కొనసాగుతున్నారు అంటూ గత రాత్రి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహించిన చర్చల్లో పాల్గొన్న కన్నా లక్ష్మీనారాయణ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.