Jio Network : దేశంలోని టెలికం దిగ్గజ సంస్థ అయినటువంటి జియో ఎప్పటికప్పుడు కస్టమర్ల కోసం అత్యాధునిక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. మరీ ముఖ్యంగా తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లను ప్రకటిస్తూ.. ఎక్కువ ప్రయోజనాలను అందిస్తూ ఉండడం గమనార్హం. ఇక ఈ క్రమంలోని చాలామంది కస్టమర్లు కూడా జియోకు మారుతూ ఉండడం జరుగుతుంది. ఇక అందుకే దేశంలోనే నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది రిలయన్స్ జియో.. నాటి నుంచి నేటి వరకు నెంబర్వన్ స్థానాన్ని కొనసాగిస్తూ కష్టమర్లను మరింత ఆకట్టుకోవడానికి మరెన్నో చేస్తూ వస్తుంది. ఇక ఈ క్రమంలోని స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఏకంగా రూ.3000 వరకు బెనిఫిట్స్ అందించడానికి సిద్ధమయ్యింది. మరి ఈ ఆఫర్ యొక్క పూర్తి వివరాలు ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
ఏడాది కాలం పాటు వ్యాలిడిటీ అందించే ఆఫర్ ను జియో తీసుకురావడం జరిగింది. ఇక ఈ ఆఫర్ ధర రూ.2999.. 365 రోజులపాటు వ్యాలిడిటీ లభించడమే కాకుండా ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను ఉచితంగా పొందవచ్చు. అంతేకాదు ప్రతిరోజు 2.5 జిబి డేటాను కూడా పొందుతారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే 750 రూపాయల విలువైన 75 జిబి డేటాను ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. రూ.2999 తో మీరు జియో రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఇంతకుమించి ఆఫర్లు కూడా మీకు లభిస్తూ ఉండడం గమనార్హం. ఇక జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ తో పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ ని కూడా ఒక సంవత్సరం పాటు పొందే అవకాశం ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా ఏడాది పాటు ఉచిత సంస్క్రిప్షన్ పొందే అవకాశం ఉంటుంది.
ఇక వీటితోపాటు మరో 250 రూపాయల విలువైన ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు. వీటిలో Ajio ఆన్లైన్ యాప్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.750 డిస్కౌంట్, నెట్ మెడ్స్ రూ.750 అలాగే Ixigo రూ.750 వరకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది. ఇక మొత్తంగా చూసుకుంటే మీరు రూ.2999 తో రీఛార్జ్ చేసుకుంటే 3000 రూపాయల డిస్కౌంట్ పొందడమే కాకుండా సంవత్సరం పాటు ఉచితంగా మాట్లాడుకోవడమే కాదు డేటాను కూడా ఎంజాయ్ చేయవచ్చు. ఇక జియో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందిస్తున్న ఈ ప్యాక్ నుంచి కస్టమర్ రివ్యూ కూడా మంచిగా ఉండడం గమనార్హం. మరి ఇంకెందుకు ఆలస్యం ఇటువంటి ఆఫర్లు సద్వినియోగం చేసుకుంటే మీకే డబ్బు ఆదా అవుతుంది.