Naresh: నరేష్ పవిత్రను నాలుగో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నరేష్ 2వ భార్య గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. బంగారం లాంటి రెండో భార్యను నరేష్ అసలు ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది.. ఆమె ఇప్పుడు ఏం చేస్తుంది అంటూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..
నరేష్ రెండో భార్య ఎవరో కాదు దేవులపల్లి కృష్ణశాస్త్రికి మనవరాలు రేఖా సుప్రియ. నరేష్ రేఖ పెళ్లి తర్వాత పుట్టిన కొడుకు తేజం కు ఆటిజం సమస్య వచ్చింది. ఆ పిల్లాడు పెరిగి పెద్దవాడు అవుతున్నా.. మానసిక ఎదుగుదల మాత్రం లేదు. అప్పుడే నరేష్ సినిమాల్లోనూ, వ్యాపారాల్లోనూ పుల్ బిజీ అయ్యారు. ఇదే విషయమై భార్య, భర్తల మధ్య ఏర్పడిన చిన్న గొడవలు చివరకు పెద్దవి అయ్యాయి. తనకు టైం కేటాయించేంత బిజీ లైఫ్ నువ్వు గడుపుతున్నప్పుడు నీకు నేను భార్యగా ఎందుకు ఉండాలని రేఖ వేసిన ప్రశ్నకు నరేష్ దగ్గర సమాధానం లేదు. అలా ఒప్పందంతోనే వాళ్ళు విడిపోయారు. రేఖా, నరేష్ ఇప్పటికీ స్నేహితులుగానే ఉంటున్నారు. వీరి బాధ్యత కూడా నరేష్ తీసుకున్నాడని సమచారం.. విడాకుల తర్వాత రేఖా సుప్రియ తన కొడుకు తేజ లాంటి మరి కొంతమంది పిల్లలను దత్తత తీసుకుని వారికి తన పూర్తి ఖర్చులతో బాగోగులు చూస్తోంది. ఓ ట్రస్ట్ స్టార్ట్ చేసి ఆటిజంతో బాధపడుతోన్న పిల్లలకు, వారి తల్లి దండ్రులకు కోచింగ్ కూడా ఇప్పిస్తుంది. రేఖా సుప్రియది చాలా మంచి మనస్తత్వం అని.. నరేష్ ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయకపోవడం వల్లే వీరి జీవిత బంధం ఎక్కువ కాలం కొనసాగలేదని టాక్. విడాకుల తర్వాత కూడా ఆమె ఆటిజం పిల్లల కోసం ఎంతో కష్టపడుతోంది. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది బంగారం లాంటి రెండో భార్యకు హీరో నరేష్ విడాకులు ఇవ్వకుండా ఉండాల్సింది అని అంటున్నారు.